New Bride Shock: పెళ్లయిన రెండు నెలలకే ఇద్దరూ జంప్‌.. అత్తకు 55, అల్లుడికి 25 ఏళ్లు

New Bride Shocks 55 Years Old Mother In Law Elopes With 25 Years Old Son In Law: కొన్నాళ్లుగా మానవ బంధాలకు విలువలేకపోతోంది. ముఖ్యంగా వివాహ బంధాలు దారుణాలకు దారితీస్తున్నాయి. తాజాగా మరో అత్త, అల్లుడు ఇద్దరూ కలిసి పారిపోయారు. విస్తుగొలిపిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 27, 2025, 05:31 PM IST
New Bride Shock: పెళ్లయిన రెండు నెలలకే ఇద్దరూ జంప్‌.. అత్తకు 55, అల్లుడికి 25 ఏళ్లు

Newly Married Couple: వివాహ బంధాలు దారుణ పరిణామాలకు దారి తీస్తున్నాయి. ఒకరు ఇంకొకరితో వెళ్లిపోవడం వరకు ఉండగా.. ఇప్పుడు వారి పిల్లలను, భర్త, భార్యలను చంపుకుంటున్న రోజులు ఇవి. ఎప్పుడు ఎవరు ఏ విధంగా చేస్తారో అర్ధం కావడం లేదు. ముఖ్యంగా పెళ్లయిన కొత్త జంటలే దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా మరో రాష్ట్రంలో అత్తా అల్లుడి కలిసి పారిపోయారు. కొత్తగా పెళ్లయిన అల్లుడిని బుట్టలో వేసుకున్న అత్త అతడితో వెళ్లిపోయింది. వీరిద్దరి మధ్య వయసు బేధం 30 ఏళ్లు ఉండడం గమనార్హం. కర్ణాటకలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Add Zee News as a Preferred Source

Also Read: Water Filled Diesel: సీఎం కాన్వాయ్‌లో డీజిల్ బదులు నీళ్లు.. ముఖ్యమంత్రికి ఏమైందో తెలుసా?

కర్ణాటకలోని దావణగెరె జిల్లా చన్నగిరి తాలూకాలో మరవంజి గ్రామానికి చెందిన గణేశ్‌ (25)కు రెండు నెలల కిందట ముద్దెనహళ్లి గ్రామానికి చెందిన హేమతో వివాహమైంది. వివాహమైన అనంతరం పూజా కార్యక్రమాలు.. తీర్థ యాత్రలు వంటి ముగిసి నెల కిందట గణేశ్‌, హేమ తమ కాపురాన్ని ప్రారంభించారు. కాపురం మొదలుపెట్టిన కొన్నాళ్లకే భార్య హేమకు విస్తుగొలిపే విషయం తెలిసిందే. తన తల్లి శాంతతో వివాహేతర సంబంధం ఏర్పడిందని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యింది.

Also Read: Weight Loss Journey: 140 కిలోల నుంచి 78 కిలోల బరువు తగ్గాడు.. అతడి సీక్రెట్‌ ఏమిటో చూద్దామా?

కుమార్తె హేమను గణేశ్‌కు ఇచ్చి శాంత దగ్గరుండి వివాహం జరిపించారు. ఇల్లరికంగా గణేశ్‌ను తన ఇంట్లోనే శాంత ఉండేలా చూసుకుంది. వివాహం జరిగిన 15 రోజుల తర్వాత గణేశ్‌ హేమ సవతి తల్లి శాంతతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అయితే ఇటీవల గణేశ్‌ మొబైల్ ఫోన్‌కు శాంత అసభ్యకర సందేశం పంపింది. ఇది చూడడంతో హేమ నిలదీసింది. హేమ వెంటనే ఆ సందేశాలను తన తండ్రి నాగరాజ్‌కు పంపించింది. తమ విషయం ఇంట్లో వారికి తెలియడంతో శాంత వెంటనే ఇంట్లోని డబ్బు, నగలు దొంగిలించి అల్లుడు గణేశ్‌తో కలిసి పారిపోయింది.

Also Read: Bank Holidays: రేపటి నుంచి 3 రోజులు బ్యాంకులకు సెలవు.. ఎందుకో తెలుసా?

పారిపోయే సమయంలో గణేశ్‌ తన భార్య హేమను బస్టాప్‌లో వదిలి పారిపోయాడు. హేమ వెంటనే చన్నగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా గణేశ్‌కు 25 ఏళ్లు ఉండగా.. అత్త శాంతకు 55 ఏళ్లు ఉన్నాయి. ఇద్దరి మధ్య 30 ఏళ్ల వయసు తేడా ఉన్నా కూడా వారి మధ్య వివాహేతర బంధం ఏర్పడింది. అయితే వివాహానికి ముందే గణేశ్‌తో శాంతకు వివాహేతర సంబంధం కొనసాగుతోందని తెలుస్తోంది. అతడితో ఇంట్లోనే తమ బంధాన్ని కొనసాగించేందుకు పెద్ద కుమార్తె హేమను ఇచ్చి శాంత పెళ్లి చేసిందనే అంశం విస్తుగొలుపుతోంది. తన సుఖం కోసం కూతురిని ఎరగా వేసిందనే విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో ఉత్తరప్రదేశ్‌లో కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగిన విషయం తెలిసిందే. కొత్త అల్లుడితో కలిసి అత్త పారిపోవడం సమాజంలో చర్చనీయాంశంగా మారాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News