
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కీలకమైన అప్డేట్. 8వ వేతన సంఘం ఏర్పాటు, ఫంక్షనింగ్కు సంబంధించిన మార్గదర్శకాలు ఖరారవుతున్నాయి. కేబినెట్ ఆమోదం లభిస్తే కొత్త వేతన సంఘం పని ప్రారంభిస్తుంది. ఏప్రిల్ నుంచి కొత్త వేతన సంఘం పని మొదలవుతుందనే అంచనా ఉంది.
ఈ ఏడాది ప్రారంభంలో జనవరి నెలలో 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం ఇచ్చిన తరువాత ఉద్యోగులు, పెన్షనర్లలో ఆసక్తి పెరిగింది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది, జీతభత్యాలు ఎంత పెరుగుతాయి అనే విషయాలు చర్చించుకుంటున్నారు. 8వ వేతన సంఘం పని ఎప్పుడు ప్రారంభమౌతుంది, ఎప్పుడు అమల్లో వస్తుందంటూ ఎదురుచూస్తున్నారు. 8వ వేతన సంఘం సిఫార్సులు, పనితీరుకు సంబంధించి సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా హోంశాఖ, హోం ఎఫైర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ శాఖల్ని కేంద్ర ఆర్ధిక శాఖ కోరింది. ఇప్పటికే వివిధ మంత్రిత్వ శాఖల నుంచి కొన్ని సూచనలు, సలహాలు అందాయి. కేంద్ర కేబినెట్ ఆమోదం లభించిన తరువాత కొత్త వేతన సంఘం వీటిని నోటిఫై చేస్తుంది.
విధి విధానాలు, మార్గదర్శకాలు ఖరారైన తరువాత 8వ వేతన సంఘం పని ప్రారంభించనుంది. ఏప్రిల్ నుంచి పని ప్రారంభమైతే 2026 మార్చ్ నాటికి కమీషన్ నివేదిక సమర్పించవచ్చు. ఏడాది కంటే తక్కువ వ్యవధిలో పూర్తయినా కావచ్చు. అయితే గతంలో నియమించిన వేతన సంఘాలు తుది నివేదిక సమర్పించేందుకు ఏడాదికి పైగా సమయం తీసుకున్నాయి.
8వ వేతన సంఘం అమల్లోకి వస్తే 50 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. 2016లో 7వ వేతన సంఘం అమలైనప్పడు ప్రభుత్వ ఖర్చు లక్ష కోట్లకు పెరిగింది. 8వ వేతన సంఘం నివేదిక సమర్పించడంలో ఆలస్యమైనా అమలయ్యేది మాత్రం 2026 జనవరి నుంచే. ప్రస్తుతం 7వ వేతన సంఘంలో ఉన్న 50 శాతం డీఏ లేదా డీఆర్ను కనీస వేతనంలో విలీనం చేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి