)
Aadhaar Cards: ఆధార్ కార్డులో త్వరలో భారీ మార్పులు జరగనున్నాయి. కార్డు దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్రం కొత్త మార్పులు చేయబోతుంది.పేరు, ఇతర వివరాలేవీ లేకుండా కేవలం ఫోటో, క్యూఆర్ కోడ్ మాత్రమే కలిగిన కార్డును ఇవ్వనుంది. డిసెంబర్ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. డేటా దుర్వినియోగం ఇప్పుడు దేశ ప్రజలకు పెద్ద సమస్యగా మారింది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఆధార్ కార్డ్.. సింపుల్గా డేటా చౌర్యానికి పాల్పడుతున్నారు.
ప్రభుత్వ నిబంధనలను అడ్డుపెట్టుకుని ఆధార్ కార్డులను తీసుకునేందుకు కొందరు వ్యక్తులు, సంస్థలు.. అందులోని డేటాతో చేయకూడని పనులు చేసేస్తున్నారు. ఆధార్ కార్డు సొంతదారుడికి తెలీకుండానే అతడి సమాచారం పక్కతోవ పడుతోంది. దీంతో ఆధార్ కార్డులో భారీ మార్పులకు ప్లాన్ చేసింది కేంద్ర సర్కార్.
అంతేకాదు దీంతో అక్రమ ఓటర్లు కార్డులు సంపాదిస్తున్న వారు.. మన దేశంలో హక్కుగా దక్కాల్సిన వాటిని వీరు అక్రమంగా కొట్టేస్తున్నారు. అంతేకాదు దొంగ ఆధార్ కార్డులతో ఇక్కడ ఓటర్ కార్డులు సంపాదించి ఇక్కడి రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేయడం బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. అందుకే అక్కడ దొంగ ఓట్లను ఏరివేసేందుకు SIR ప్రాసెస్ మొదలు పెట్టారు. దీనిపై కొన్ని పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. ఏది ఏమైనా దేశ భద్రత విషయంలో రాజీ పడకూడదనే ధృడ సంకల్పంతో కేంద్రం ఆధార్ కార్డు పై ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఆధార్ కార్డును 2004లో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం... నందన్ నీలేకని ఆధ్వర్యంలో ఈ కార్డును ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే కదా.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.