)
Snake cuts 3 pieces girl died by cobra bite in Madhya Pradesh: పాములు వర్షాకాలంలో ఎక్కువగా మానవ నివాసాల్లోకి వస్తుంటాయి. ముఖ్యంగా అడవులకు దగ్గరగా ఉన్న ఇళ్లలో, పొలాలకు దగ్గరగా ఉన్న ఇళ్లలోకి పాములువస్తుంటాయి. ఎలుకలు ఉంటే చోట పాములు తప్పకుండా ఉంటాయి.
అయితే పాము తల తన శరీరం నుంచి తెగిపోయిన కూడా కొన్ని గంటల పాటు అది సజీవంగా ఉంటుందని, కాటు వేస్తుందని ఇప్పటికే అనేక ఘటనలు జరిగాయి. చాలా మంది పామును చంపేశామని, అనుకుని దాని దగ్గరకు వెళ్తారు. అప్పుడు దాని తల భాగం కాటు వేసిన ఘటనలు ఉన్నాయి. తాజాగా.. అచ్చం ఇలాంటి ఘటన మధ్య ప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది.
మధ్యప్రదేశ్లోని మోరెనా జిల్లాలో విషాదకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. సబల్గఢ్ ప్రాంతం నౌదండ గ్రామంలో యువతి రోజులాగానే మిషిన్ తో గడ్డిని కోస్తుంది.
భారతి అనే 18 ఏళ్ల యువతి తన ఇంట్లో పశువుల కోసం గడ్డిని మిషన్తో కత్తిరిస్తోంది. అప్పుడు గడ్డిలో ఒక నాగు పాము దాక్కుంది. కానీ ఆమె గమనించలేదు. దీంతో గడ్డి కోసే యంత్రంతో గడ్డిని కోస్తుండగా కోబ్రా ముడుముక్కలైంది. అప్పుడు ముక్కలైన పాము తలభాగం యువతిని పలు పర్యాయాలు కాటు వేసింది. దీంతో ఆమె తీవ్ర అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది.
దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు యువతికి సరైన వైద్యం అందించకుండా నాటు వైద్యంను ఆశ్రయించారు. కానీ ఆతర్వాత యువతి ఆరోగ్యం మరింత దిగజారగటంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు . కానీ అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
అయితే..యువతి పాము కాటుతో అమ్మాయి చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పాము తల తెగిపోయిన కూడా యువతిని కాటు వేయడంపై అందరు షాక్ అవుతున్నారు. మరోవైపు బాధిత కుటుంబానికి ప్రభుత్వ సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి