
Ahmedabad Plane Crash: ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ డ్రీమ లైనర్కు చెందిన A1 171 టేకాఫ్ సమయంలో కుప్పకూలి 242 మంది మరణించారు. ఎయిర్ ఇండియా బోయిగ్ విమానంలోని 5 అతి పెద్ద తప్పిదాలే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఆ తప్పులేవో తెలుసుకుందాం.
అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మద్యాహ్నం 1.38 గంటలకు టేకాఫ్ అయిన అహ్మదాబాద్ లండన్ విమానం బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ A1 171 రెండే రెండు నిమిషాల్లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 242 మంది మరణించారు. ఇండియాలో జరిగిన అతి పెద్ద విమాన ప్రమాదం ఇది. బోయింగ్ సంస్థ గతంలో ఎదుర్కొన్న సాంకేతిక లోపాలను మరోసారి సమీక్షించే పరిస్థితి ఏర్పడింది. బోయింగ్ విమానయాన సంస్థ గతంలో 5 ప్రధాన తప్పిదాలు ఎదుర్కొంది.
2013లో జపాన్కు చెందిన రెండు విమాన సంస్థలు బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానాలు కొనుగోలు చేయగా వాటిలోని లిథియల్ అయాన్ బ్యాటరీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విమానాలను అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. దాంతో అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ 3 నెలలు వీటిపై నిషేధం విధించింది. ఆ తరువాత 2020-2 మద్య కాలంలో బోయింగ్ డ్రీమ్ లైనర్ తయారీ లోపాలు నమోదయ్యాయి. విమాన భాగాలు వేర్వేరుగా తయారుచేసి అసెంబుల్ చేయడంతో మద్యలో గ్యాప్స్ ఏర్పడ్డాయి.
2024లో అదే సంస్థకు చెందిన సామ్ సాలెహ్ అనే ఓ ఉద్యోగి ఈ విమానంలో కొన్ని భాగాలను సరిగ్గా కలపలేదని ఆరోపణలు చేశాడు. ఫలితంగా విమానం మధ్యలో విరిగిపోయే ప్రమాదం ఉందని చెప్పినా బోయింగ్ సంస్థ పట్టించుకోలేదు. మరో ఉద్యోగి జాన్ బార్నెట్ కూడా బోయింగ్ విమానాల భద్రతపై ప్రశ్నలు సంధించాడు. ఇది జరిగిన కొన్ని నెలలకు అతడి మృతదేహం అనుమానాస్పదంగా కన్పించింది.
బోయింగ్ 787-8 విమానాల్లో చాలాసార్లు ఇంజన్ సమస్యలు, ఎలక్ట్రిక్ వ్యవస్థ వైఫల్యం, ఫ్యూయల్ లీకేజ్, సాఫ్ట్వేర్ లోపాలు నమోదయ్యాయి. ఓసారి హైడ్రాలిక్ లీక్ కారణంగా విమానాన్ని రన్ వేపై నిలిపివేయాల్సి వచ్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
మా సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook