ఫొని తుపాన్: మరోసారి పెద్ద మనసు చాటుకున్న అక్షయ్ కుమార్

ఫొని తుపాన్ బాధితులకు భారీ విరాళం అందించి పెద్ద మనసు చాటుకున్న అక్షయ్ కుమార్

Last Updated : May 7, 2019, 09:12 PM IST
ఫొని తుపాన్: మరోసారి పెద్ద మనసు చాటుకున్న అక్షయ్ కుమార్

ఒడిశాలో ఫొని తుపాన్ కారణంగా సర్వం కోల్పోయి రోడ్డున పడిన బాధితులకు ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ అండగా నిలిచారు. ఒడిశాలోని ఫొని తుపాన్ బాధితులకు రూ. 1 కోటి బారీ విరాళం అందించి తన పెద్ద మనసు చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న వారికి అక్షయ్ కుమార్ ఆపన్నహస్తం అందించడం ఇదేం మొదటిసారి కాదు.. కేరళలో వరదలు సంభవించినప్పుడు, చెన్నైని తుపాన్ ముంచెత్తినప్పుడు కూడా అక్షయ్ కుమార్ వారికి ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు. అంతేకాకుండా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలను ఆదుకునేందుకు సైతం భారత్ కే వీర్ నినాదంతో ఓ నిధిని ఏర్పాటు చేసి వారికి తన వంతు సహాయాన్ని అందించారు. 

దాదాపు పది రోజులపాటు తూర్పు తీరాన్ని వణికించిన ఫొని తుపాన్.. ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్రాల్లో తీవ్ర నష్టం మిగల్చగా ఆంధ్రప్రదేశ్‌లోనూ ఫొని తుపాన్ భారీ నష్టాన్నే చేకూర్చిన సంగతి తెలిసిందే.

Trending News