Pawan Kalyan: కర్ణాటక గడ్డపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అరుదైన గౌరవం.. ‘అభినవ కృష్ణదేవరాయ’ బిరుదు ప్రదానం..!

Ap Deputy Cm Pawan Kalyan: కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ దేవాలయంలో పవన్ కల్యాణ్‌కు ‘అభినవ కృష్ణదేవరాయ’ అనే బిరుదును ప్రదానం చేశారు. ఉడిపి పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం నిర్వహించిన బృహత్‌ గీతోత్సవ మహోత్సవంలో మఠాధిపతి సుగుణేంద్ర తీర్థ స్వామీజీ స్వయంగా ఈ బిరుదును పవన్‌కు ప్రదానం చేశారు.

Written by - Aruna Maharaju | Last Updated : Dec 8, 2025, 11:31 AM IST
Pawan Kalyan: కర్ణాటక గడ్డపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అరుదైన గౌరవం.. ‘అభినవ కృష్ణదేవరాయ’ బిరుదు ప్రదానం..!

Pawan Kalyan Conferred With Abhinava Srikrishna Devaraya Title: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కర్ణాటక రాష్ట్రం ఉడిపి శ్రీకృష్ణ మఠంలో నెలరోజులుగా జరుగుతున్న లక్షకంఠ గీతాగాన కార్యక్రమం ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభాలతో పవన్ కల్యాణ్‌కు మఠంలోకి స్వాగతం పలికారు. అనంతరం పవన్ కనకన కిండి నుంచి కృష్ణుడిని దర్శించుకున్నారు. అయితే, ఈ పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ కు అరుదైన గౌరవం దక్కింది.

Add Zee News as a Preferred Source

కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ దేవాలయంలో పవన్ కల్యాణ్‌కు ‘అభినవ కృష్ణదేవరాయ’ అనే బిరుదును ప్రదానం చేశారు. ఉడిపి పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం నిర్వహించిన బృహత్‌ గీతోత్సవ మహోత్సవంలో మఠాధిపతి సుగుణేంద్ర తీర్థ స్వామీజీ స్వయంగా ఈ బిరుదును పవన్‌కు ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ భగవద్గీత ప్రాముఖ్యత, ధర్మం, తన రాజకీయ ప్రయాణం గురించి మాట్లాడారు. తాను ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎంగానో, ప్రజా సేవకుడిగానో రాలేదని.. ధర్మాన్ని అన్వేషించే ఒక వినయ పూర్వక సాధకుడిగానే వచ్చానన్నారు. సరైన పాలన, సేవ, బాధ్యతలతో కూడిన ప్రతి చర్య నిజమైన నాయకత్వానికి నిదర్శనమన్నారు పవన్. ఏపీ ఎన్నికలకు ముందు తాను కూడా అర్జునుడి లాంటి సందిగ్ధతను ఎదుర్కొన్నానని అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే రాష్ట్ర సమగ్ర శ్రేయస్సే ముఖ్యమని.. ధర్మాన్ని అనుసరించే కేవలం 21 స్థానాలకే పరిమితమయ్యామన్నారు.

భగవద్గీత అనేది కేవలం ఒకసారి చదివి, ఎర్ర వస్త్రంలో చుట్టి పూజాగదిలో పెట్టే గ్రంథం కాదని పవన్ కల్యాణ్ అన్నారు. జీవితంలో ఎదురయ్యే ప్రతి నిర్ణయంలో, ప్రతి గందరగోళంలో, ప్రతి అంతర్గత పోరాటంలో.. భగవద్గీత మనతోనే నడుస్తుందని, మన కురుక్షేత్రాల్లో స్థిరమైన తోడుగా నిలుస్తుందన్నారు. నేటితరం యువత నిరంతరం సమాచార వెల్లువ, కెరీర్ ఒత్తిడి, గుర్తింపు సంక్షోభం, వైఫల్య భయాలు వంటి ఆధునిక కురుక్షేత్రాలను ఎదుర్కుంటోందని.. వారికి అత్యంత అవసరమైన మానసిక బలం, భావోద్వేగ నిలకడను గీత అందిస్తుందని పేర్కొన్నారు. మన కర్మభూమి ఎన్నో దండయాత్రలను తట్టుకుని నిలబడింది ఆయుధాలు లేదా సంపదతో కాదని, ధర్మాన్ని సజీవంగా ఉంచిన గ్రంథాలు, సంప్రదాయాలు, సాధువులు, పవిత్ర సంస్థల వల్లేనని పవన్ అన్నా రు.

సంస్కృతి కోసం స్వరాన్ని పెంచాలని.. ఇతరులు మన ధర్మం మీద దాడులు చేస్తున్నారనడం కంటే, ముందు మన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలని పవన్ కల్యాణ్ అన్నారు. ఇతరులు మనపై దాడి చేయకుండా గళమెత్తాలన్నారు. తమిళనాడులో మన ధర్మాన్ని మనం అనుసరించడంకోసం అక్కడివారు న్యాయపోరాటాలు చేయాల్సి వస్తోందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.

Also Read: Be Careful: అలర్ట్.. 30 ఏళ్ల తర్వాత ఈ పదార్థాలను ముట్టుకోకండి.. లేకపోతే దెబ్బైపోతారు జాగ్రత్త..!

Also Read: Plastic surgery: సమంత నుండి రష్మిక మందన్నా వరకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న టాప్-10 హీరోయిన్స్ వీళ్లే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Aruna Maharaju

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. లైఫ్‌స్టైల్‌, హెల్త్‌,  స్పోర్ట్స్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో ఆరేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News