)
Bank Holidays: బ్యాంక్ ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు. దేశవ్యాప్తంగా ఈ నెల 24, 25 తేదీల్లో బ్యాంక్ ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. దేశంలోని బ్యాంక్ యూనియన్ల ఐక్య వేదిక యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సమ్మె ప్రకటించింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్తో జరిపిన చర్చలు ఎలాంటి ఫలితాలు ఇవ్వకపోవడంతో సమ్మె తప్పడం లేదు.
దేశంలోని బ్యాంకులు వరుసగా నాలుగు రోజులు మూతపడనున్నాయి. బ్యాంకు కస్టమర్లు ఈ విషయాన్ని తప్పకుండా గమనించాల్సి ఉంటుంది. బ్యాంకు పనులుంటే మాత్రం ముందస్తుగా లేదా వాయిదా వేసుకోవడం మంచిది. వారానికి ఐదు రోజుల పనిదినాలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీలు భర్తీ చేయడం, ఉద్యోగ భద్రతకు ముప్పు కల్గిస్తున్న ఆర్ధిక సేవల విభాగం మార్గదర్శకాలు, ప్రపంచ బ్యాంకు బోర్డుల అటానమస్ హోదా వంటి వాటి కోసం బ్యాంకు ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. అంతేకాకుండా గ్రాట్యుటీ చట్టంలో సవరణ కోసం డిమాండ్ చేస్తున్నాయి. గ్రాట్యుటీ పరిమితిని 25 లక్షలకు పెంచి ప్రభుత్వ ఉద్యోగులతో సమానం చేయాలనేది మరో డిమాండ్. ఈ గ్రాట్యుటీని ఆదాయపు పన్ను నుంచి మినహాయించాలి. ఈ డిమాండ్ల సాధన కోసం దేశంలోని మొత్తం 9 బ్యాంకు ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగుతున్నాయి.
వాస్తవానికి బ్యాంకు సమ్మె ఈ నెల 24, 25 తేదీల్లో రెండు రోజులు ఉంది. అయితే మార్చ్ 22వ తేదీ నాలుగవ శనివారం, మార్చ్ 23 ఆదివారం కావడంతో వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు పనిచేయవు. అందుకే బ్యాంకు పనులుంటే ఈలోగా పూర్తి చేసుకోవడం మంచిది. ప్రస్తుతం అంతా ఆన్లైన్ లావాదేవీలే అధికంగా జరుగుతున్న పరిస్థితి. అయినా కొన్ని పనుల కోసం ఇప్పటికీ బ్యాంకులకు వెళ్లాల్సిందే. బ్యాంకులు మూసివేయడం వల్ల నెఫ్ట్ వంటి సేవలు నిలిచిపోనున్నాయి. చెక్ క్లియరెన్స్, డిమాండ్ డ్రాఫ్ట్స్ సౌకర్యం ఆగిపోతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి