Bengaluru Stampede: చిన్నస్వామి స్టేడియం ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రకటించిన పరిహారాన్ని రూ.25 లక్షలకు పెంచాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశించారు. గతంలో ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. ఈ తొక్కిసలాటలో 11 మంది మరణించగా, 33 మంది గాయపడ్డారు. RCB ఐపీఎల్ విజయాన్ని జరుపుకోవడానికి ఊహించని విధంగా భారీ సంఖ్యలో జనం గుమిగూడినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఇది ఊహించిన దానికంటే చాలా ఎక్కువ. స్టేడియంలో దాదాపు 35,000 మంది కూర్చునే సామర్థ్యం ఉంది కానీ దాదాపు 2 నుండి 3 లక్షల మంది అక్కడికక్కడే గుమిగూడారు. దీని కారణంగా ఈ ప్రమాదం జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఇద్దరు చిన్నారులతోపాటు ఓ మహిళ కూడా ఉంది. మరో 50 మందికి గాయాలయ్యాయి. మరణించినవారి కుటుంబాలకు ఆర్సీబీ ఫ్రాంచైజీ రూ. 10లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం రూ. 2లక్షల వరకు అందిస్తామని ప్రకటించింది.
ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమయ్యింది. ఇప్పటికే ఈ ఘటనపై న్యాయవిచారణ కోసం కర్నాటక సర్కార్ ఓ కమిటీని కూడా నియమించింది. విచారణ చేపట్టిన పోలీసులు ఆర్సీబీ ఫ్రాంచైజీతోపాటు కర్నాటక క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘురామ్ భట్, ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ డీఎన్ఏ ఎంటర్ టైన్ మెంట్ పై కేసులు నమోదు చేశారు. ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సొసెల్ తోపాటు ఈవెంట్ ఆర్గనైజర్స్ సునీల్ మాథ్యూ, కిరణ్, సుమంత్ లను కూడా అరెస్టు చేశారు.
మరోవైపు ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ కర్నాటక ప్రభుత్వం బెంగళూరు పోలీస్ కమిషనర్ బి దయానంద్ ను సస్పెండ్ చేసింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పొలిటికల్ సెక్రటరీ కూడా విధుల నుంచి తొలగించేశారు. మరికొందరు ఉన్నతాధికారులపై కూడా సస్పెన్షన్ వేటు పడింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









