
NPS To UPS Deadline Extension: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరట లభించింది. ఉద్యోగులు జాతీయ పింఛన్ పథకం (ఎన్పీఎస్) నుంచి యూనిఫైడ్ పింఛన్ పథకం (యూపీఎస్)లో చేరాలనుకునే ఉద్యోగులకు సంబంధించిన గడువును ప్రభుత్వం తాజాగా పొడిగించింది. యూపీఎస్లో చేరేందుకు ఈ నెల 30వ తేదీ వరకు మాత్రమే గడువు ఉండగా.. తాజాగా ఆ గడువును ప్రభుత్వం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
పదవీ విరమణ తరువాత తమకు కచ్చితమైన పెన్షన్ ఇచ్చే పాత పింఛన్ విధానాన్ని మళ్లీ పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఎన్డీయే సర్కార్ యూనిఫైడ్ పింఛన్ పథకం (యూపీఎస్)ను తీసుకువచ్చింది. అయితే ఉద్యోగులు కావాలనుకుంటే జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్)లో కొనసాగవచ్చు. లేదంటే యూపీఎస్లో చేరొచ్చు. యూపీఎస్లో చేరేందుకు ఈ నెల 30వ తేదీ వరకు మాత్రమే సమయం ఉంది. ఈ నెల 28వ తేదీలోగా ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది.
యూపీఎస్పై అనేక సందేహాలు మిగిలిపోవడంతో ఉద్యోగులు సందిగ్ధంలో పడిపోయిన పరిస్థితుల్లో వారు ఇంకా ఎందులో చేరాలనే విషయమై ఇంకా స్పష్టత తీసుకోలేదు. ఒక్కసారి యూపీఎస్లో చేరితే.. మళ్లీ ఎన్పీఎస్కు మారే అవకాశం ఉండదు. దీంతో ఉద్యోగులు ఇంకా ఎన్పీఎస్లో చేరేందుకు ఆలోచన చేస్తున్నారు. పూర్తి పెన్షన్కు కనీస సర్వీస్, అడ్వాన్స్ విత్ డ్రాలపై ఆంక్షలు, బెంచ్ మార్క్ కార్పస్ ఫండ్ తదితర అంశాలపై స్పష్టమైన వివరణలు లేకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణ, ఏపీలో..
తెలుగు రాష్ట్రాల్లో 12 వేల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీరు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ప్రయోజనాలు
ఓపీఎస్, ఎన్పీఎస్ రెండు స్కీమ్స్లో ప్రయోజనాలను కలిపి ఓపీఎస్ను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది.
ఎన్పీఎస్ కింద ఈక్విటీ, లోన్ పెట్టుబడుల ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు అధిక పెన్షన్లను పొందవచ్చు.
పాత పింఛన్ పథకంలో పదవీ విరమణ తర్వాత గ్యారంటీ పెన్షన్ లభిస్తుంది.
యూపీఎస్ ప్రయోజనాలు
యూపీఎస్ విషయానికి వస్తే రిటైర్మెంట్ తరువాత ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో నిబంధనలు రూపొందించారు.
ఉద్యోగులు కనీసం 25 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకుంటే వారి సగటు ప్రాథమిక జీతంలో 50 శాతం (పదవీ విరమణకు ముందు 12 నెలల నుంచి) పింఛన్గా పొందుతారు
25 ఏళ్ల సర్వీస్ కంటే తక్కువ సర్వీస్తో ముందే రిటైర్ అయినా.. వాలంటరీ రిటైర్మెంట్ అయినా.. పెన్షన్లో కోత పడుతుంది.
25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేయడంతోపాటు కార్పస్ ఫండ్ నుంచి పాక్షికంగా విత్ డ్రా చేయకుండా, డిఫాల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఎంచుకుంటే పూర్తి పెన్షన్కు అర్హులు అవుతారు.
పెన్షన్ పొందేందుకు అర్హత సాధించాలంటే కనీసం పదేళ్ల సర్వీస్ కచ్చితంగా పూర్తి చేసుకోవాలి.
యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో చేరిన ఉద్యోగులు తమ వేతనం నుంచి 10 శాతం కార్పస్ ఫండ్కు జమ చేస్తే కేంద్రం 18 శాతం జమ చేస్తుంది. ఈ మొత్తం డబ్బులను ఎన్పీఎస్లో ఇన్వెస్ట్ చేస్తారు. అవసరాల కోసం ఫండ్ నుంచి విత్ డ్రా చేసుకుంటే.. పెన్షన్లో కోత పడుతుంది. ఒక ఉద్యోగి పదవీ విరమణ చేసే నాటికి.. రూ.45 వేలు జీతం అందుకుంటే రూ.22,500 పెన్షన్ పొందుతారు. ఒకవేళ కార్పస్ ఫండ్ నుంచి విత్ డ్రా చేసుకుని ఉంటే.. ఆ మేరకు పెన్షన్ లెక్కింపు చేసి తగ్గిస్తారు.
ఉద్యోగుల ఆందోళన
చాలా మంది ఉద్యోగులు యూపీఎస్లో చేరేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఎన్పీఎస్లో కనీసం 60 శాతం ఫండ్ని వెనక్కు తీసుకునే అవకాశ ఉంది. కానీ యూపీఎస్లో ఆ అప్షన్ లేదు. ఒకవేళ విత్ డ్రా చేసుకుంటే పెన్షన్లో కోత పడుతుంది. రిటైర్మెంట్ తరువాత పే అవుట్ను పెన్షన్గా పరిగణించడం లేదు. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ను ఎలా లెక్కిస్తారనే అంశంపై క్లారిటీ లేదు. ఉద్యోగి జీతం నుంచి చెల్లించిన 10 శాతం నగదు మళ్లీ వెనక్కి రాదు. ఉద్యోగి వాటా నుంచి పెన్షన్ లెక్కిస్తే.. రిటైర్మెంట్ తరువాత తమకు గ్రాట్యూటీ తప్ప ఇంకేమి మిగలదని ఉద్యోగులు అంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook