DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్లు.. డీఏ పెంపుతోపాటు 8 భారీ కానుకలు

Govt Employees 2 Percent DA Hike And Other 8 Benefits: ప్రజలకు సేవ చేసే ఉద్యోగులకు ప్రభుత్వం భారీ ఆఫర్లు ప్రకటించింది. ఒకటీ కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది కానుకలను అందించింది. డీఏ పెంపుతోపాటు ఇతర బంపర్‌ ఆఫర్లు ఏమిటో తెలుసుకుందాం.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 28, 2025, 07:08 PM IST
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్లు.. డీఏ పెంపుతోపాటు 8 భారీ కానుకలు

Govt Employees Offers: ప్రజలకు సేవలు అందించే ప్రభుత్వ ఉద్యోగులకు భారీ నజరానాలు లభించాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వం ఉద్యోగులకు ఆఫర్లు ప్రకటించింది. ప్రభుత్వ సేవలను ప్రజలకు అందిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగుల సేవలను గుర్తించిన ప్రభుత్వం కరువు భత్యంతోపాటు అదనంగా మరో 8 ఆఫర్లను అందించింది. ఉద్యోగులకు ఒకేసారి భారీ కానుకలు ఇవ్వడం ఇదే తొలిసారి. తమిళనాడు ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు అందించిన కానుకలను తెలుసుకుందాం.

Also Read: Chandrababu Naidu: 'అమరావతి అందరిది... రాష్ట్రానికి ఆత్మవంటిది': సీఎం చంద్రబాబు

శాసనసభ సమావేశాల్లో ఉద్యోగుల సేవలను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీర్తించారు. ఈ సందర్భంగా ఉద్యోగులను ప్రశంసిస్తూ వారికి నవరత్నాలు ప్రకటించారు. 'ద్రవిడ నమూనా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో ప్రజా ప్రాజెక్టులు, వివిధ రంగాలలోని అద్భుత పనులు చేపట్టాం. ఈ పనులతో తమిళనాడు జాతీయ స్థాయిలో తొలి స్థానంలో నిలిచింది. అనేక అంశాల్లో ఆదర్శ రాష్ట్రంగా తమిళనాడు నిలవడానికి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల నిజాయితీ సహకారం ప్రధాన కారణం' అని సీఎం స్టాలిన్‌ తెలిపారు. 'ప్రభుత్వ పథకాలు ప్రజలను చేరుకోవడానికి వారధిగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను ప్రశంసిస్తున్నా. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం నేను తొమ్మిది ప్రకటనలు ఇస్తున్నా' అని సీఎం స్టాలిన్‌ ప్రకటించారు.

Also Read: BRS Party: 'మీక్కావాల్సింది ఇదేగా.. ఇగ చూసుకోరి'.. జోష్‌ పెంచిన కేసీఆర్‌ ప్రసంగం

సెలవులు
ప్రభుత్వ ఉద్యోగులు 15 రోజుల వరకు ఆర్జిత సెలవులను (ఎర్న్‌డ్‌ లీవ్‌) సరెండర్ చేసి వాటి ద్వారా ఆదాయం పొందవచ్చు. అక్టోబర్ 1, 2025 వరకు నగదు ప్రయోజనాలను పొందవచ్చు. ఉద్యోగుల ఎర్న్‌డ్‌ లీవ్స్‌ ఆర్జించేందుకు ఏడాదికి రూ.3,561 కోట్ల అదనపు కేటాయింపులు చేస్తున్నారు. ఈ ప్రకటన ద్వారా 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం లభించనుంది.

డీఏ పెంపు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం అక్టోబర్ 1వ తేదీ 2025 నుంచి రెండు శాతం పెరుగుతుంది. డీఏ పెంపుతో 16 లక్షల మంది ఉపాధ్యాయులు, పింఛన్‌దారులు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. డీఏ పెంపు అమలు కోసం సంవత్సరానికి రూ.1,252 కోట్లు అదనంగా కేటాయించనున్నారు. 

పండుగ బోనస్‌
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇచ్చే పండుగ బోనస్‌ను రూ.20,000 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

విద్యా అడ్వాన్స్‌
ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఉన్నత విద్య కోసం అందించే విద్యా అడ్వాన్స్‌ను ఈ సంవత్సరం నుంచి వృత్తి విద్యా కోర్సులకు రూ.లక్ష, ఆర్ట్స్, సైన్స్, పాలిటెక్నిక్ కోర్సులకు రూ.50,000 చొప్పున ప్రభుత్వం పెంచనుంది.

వివాహ అడ్వాన్స్‌ భారీగా పెంపు
మహిళా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల వివాహ అడ్వాన్స్‌ను ఊహించని స్థాయిలో పెంచేశారు. రూ.10 వేల నుంచి ఏకంగా రూ.5 లక్షలకు పెంచుతూ సీఎం స్టాలిన్‌ సంచలన నిరణయం తీసుకున్నారు.

పొంగల్‌ కానుక
పొంగల్ (సంక్రాంతి) పండుగ సందర్భంగా కేటగిరీ సీ, డీలోని అన్ని కుటుంబ పెన్షనర్లకు (పెన్షనర్లు) ఇచ్చే నగదు బహుమతి మొత్తాన్ని రూ.వెయ్యికు పెంచారు. ఈ పెంపుతో ప్రభుత్వానికి అదనంగా రూ.74 కోట్లు వ్యయం కానుంది.

పండుగ ముందస్తు చెల్లింపు
పెన్షనర్లు తమ కుటుంబాలతో కలిసి పండుగ చేసుకునేందుకు వీలుగా పండుగ ముందస్తు చెల్లింపును రూ.6,000కి పెంచనున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి అదనంగా రూ.10 కోట్లు ఖర్చు చేయనుంది.

పెన్షన్ పథకాలు
పాత పింఛన్‌ పథకం, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, ఇంటిగ్రేటెడ్ పెన్షన్ స్కీమ్‌పై అధ్యయనం చేయడానికి ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీ 9 నెలల్లోపు నివేదికను సమర్పించాల్సి ఉంటుంది.

ప్రసూతి సెలవు
వివాహిత ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రసూతి సెలవు కాలాన్ని అర్హత కాలంలో లెక్కించవచ్చని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News