
Govt Employees Salary Hike: కోటి మందికి పైగా ఉద్యోగులు.. లక్షలాది పింఛన్దారులకు ఇది చేదువార్తనే. సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న జీతాల పెంపు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటుచేసింది కానీ దాని గురించి ఎలాంటి ప్రకటన చేయడం లేదు. ఎలాంటి ఊసెత్తకపోవడంతో జనవరి 2026లో అమలుచేయాల్సిన గడువు మరింత వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. జీతాల పెంపు జనవరి 2026 కాకుండా ఆ ఏడాది చివరికి వాయిదా పడుతుందని చర్చ జరుగుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
8వ వేతన సంఘం చుట్టూ కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులు భారీ ఆశలు పెంచుకున్నారు. వేతనాల్లో భారీ పెరుగుదలతోపాటు పింఛన్లో కూడా భారీ మార్పులు వస్తాయని ఉద్యోగులు, పింఛన్దారులు ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు. 8వ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా 2025 మధ్య నాటికి కమిషన్ ఏర్పాటుపై ముందడుగు పడలేదు. దీని ఫలితంగా వేతన సంఘంపై అనిశ్చితి ఏర్పడింది.
గతంతో పోలిస్తే..?
7వ వేతన సంఘం జనవరి 2016లో అమల్లోకి వచ్చింది. అమలు తేదీని రెండు సంవత్సరాల కిందట ప్రకటించారు. అంటే ఫిబ్రవరి 2014లో 7వ వేతన సంఘం అమలు తేదీని ప్రకటించారు. దాని సిఫార్సులను సమీక్షించి అమలు చేయడానికి తగినంత సమయం లభించింది. అయితే నాటి పరిస్థితికి భిన్నంగా ప్రస్తుతం ప్రస్తుతం 8వ వేతన సంఘం తీరు ఉంది. ఇంకా కమిషన్ ఏర్పాటు కాకపోగా.. నిబంధనలను ఖరారు చేయడం వంటి కీలకమైన ప్రాథమిక పనులు పెండింగ్లో ఉన్నాయి.
2027కు వాయిదా?
అంతర్గత చర్చలు జరుగుతున్నాయని అధికారులు చెబుతుండగా.. జనవరి 1, 2026లోపు వేతనాల పెంపు అమలు అవుతుందని ఉద్యోగులు, పింఛన్దారులు ఆశిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఈ గడువులోపు అమలవడం చాలా కష్టంగా కనిపిస్తోంది. 8వ వేతన సంఘం 2025 చివరి నాటికి ప్రకటించినా కమిషన్ తన నివేదికను సమర్పించడానికి, ప్రభుత్వం మార్పులను ఆమోదించి అమలు చేయడానికి ఇంచుమించుగా 18 నుంచి 24 నెలల సమయం పడుతుంది. దీని ప్రకారం చూస్తే 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో జీతాల పెంపుదల ఉండే అవకాశం ఉంది.
ఆందోళన
ఈ వార్తలతో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. 8వ వేతన సంఘం ఎప్పుడో ఏర్పాటు చేయాల్సి ఉండగా.. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఉద్యోగుల సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఉద్యోగ వర్గాలు మండిపడుతున్నాయి. వేతన సంఘం తక్షణమే ఏర్పాటుచేసి 2026 జనవరిలోపు వేతనాల పెరుగుదల అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరి 8వ వేతన సంఘంపై పరిణామాలు ఎలా మారుతాయో వేచి చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook