Bihar Election Result 2025: బిహార్ లో కాషాయ ప్రభంజనం.. 60 ఏళ్ల రికార్డ్ బద్దలు..

Bihar Election Result 2025: బిహార్ ఎలక్షన్స్ లో వార్ వన్ సైడ్ అన్నట్టుగా సాగుతుంది. బీజేపీ, జేడీయూ కూటమి మెజారిటీ మార్క్ దాటి రెండింట మూడొంతల మెజారిటీని దాటి ఆధిక్యంలో దూసుకుపోతుంది. అంతేకాదు గత 60 యేళ్ల రికార్డును బద్దలు కొట్టింది.   

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 14, 2025, 11:52 AM IST
Bihar Election Result 2025: బిహార్ లో కాషాయ ప్రభంజనం.. 60 ఏళ్ల రికార్డ్ బద్దలు..

Bihar Election Result 2025: 2025లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్టీయే కూటమి భారీ ఆధిక్యంలో దూసుకుపోతుంది. బిహార్ లో నరేంద్ర మోడీ, నితిష్ కుమార్ కాంబో (నిమో) కాంబినేషన్ సూపర్ హిట్టైయింది. మరోసారి బిహార్ ప్రజలు ఎన్డీయే కూటమే విజయం కట్టబెట్టారు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఎన్డీయే  గెలవడానికి సోషల్ ఇంజనీరింగ్ కూడా బాగా పనిచేసింది. బిహార్ లో జేడీయూకు సాంప్రదాయంగా వస్తోన్న కుర్మీ ఓట్లతో పాటు బీజేపీ అండగా ఉన్న బ్రాహ్మణ్, బనియా, భూమిహార్ లతో పాటు యాదవేతర ఓబీసీలు ఓట్లు గంపగుత్తగా కూటమి వైపు మళ్లాయి. అటు  ఎల్జేపీ వల్ల దళితులు ఓట్లు.. హిందూస్థాన్ అవామీ మోర్చా వల్ల బిహార్ లో మహా దళితుల ఓట్లలో మెజారిటీ ఓట్లు ఎన్డీయే వైపు మొగ్గు చూపినట్టు ఫలితల సరళిని చూస్తే తెలుస్తోంది. 

Add Zee News as a Preferred Source

మరోవైపు ఎన్నికల ముందు నితీష్ కుమార్ .. మహిళల స్వావలంభన వారి అకౌంట్లలో వేసిన  డబ్బులతో పాటు యేడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి సంక్షేమ పథకాలు కూడా బీజేపీ,జేడీయూ గెలుపుకు దోహదం చేశాయి. పైగా ఎన్నికలకు వారం రోజుల నుంచి ప్రధాన మంత్రి సుడిగాలి పర్యటనతో మొత్తంగా ఓటర్లను ఎన్డీయే కూటమి వైపు మళ్లించడంలో విజయం సాధించారు.  

ముఖ్యంగా లాలూ ప్రసాద్ యాదవ్ పాలనలోని జంగిల్ రాజ్ పాలనను.. నితీష్ కుమార్ పాలనతో కంపేర్ చేస్తే.. అపుడు బిహార్ ఎలా ఉంది.. ఇపుడు బిహార్ ఎలా ఉందనే దానిపై పోలిక తెస్తూ ఇప్పటి యూత్ ఓటర్లను తన వైపు తిప్పుకున్నారు. మరోవైపు హిందుత్వ అంశాలు.. నరేంద్ర మోడీ ఇమేజ్ కలిసొచ్చి బిహార్ లో మరోసారి బీజేపీ, జేడీయూ కూటమికి ప్రజలు  అధికారం కట్టబెడుతున్నారు.  

ప్రస్తుతం బిహార్ లో ఎన్డీయే కూటమి మెజారిటీ మార్క్ 122 దాటి 188 స్థానాల్లో లీడింగ్ లో  కొనసాగుతుంది. బీజేపీ 84 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ అతిపెద్ద పార్టీగా తొలిసారి అవతరించబోతుంది. జేడీయూ 73 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఎల్జేపీ 23 స్థానాలు.. హిందూస్థాన్ అవామీ మోర్చ 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది.  

ఈ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ చెరో 101 స్థానాల్లో పోటీ చేశాయి. లోక్ జనశక్తి (రాంవిలాస్ పాశ్వాన్) -28 స్థానాలు.. హిందూస్థాన్ అవామ్ మోర్చా (HAM)-6, రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM)-6 స్థానాల్లో పోటీ చేశాయి. అందులో లోక్ జనశక్తి పార్టీ ఓ అభ్యర్ధి నామినేషన్ తిరస్కరణకు గురైంది. 

మహా గఠ్ బంధన్ తరుపు ఆర్జేడీ 143 స్థానాలు.. కాంగ్రెస్ 61 స్థానాలు.. సీపీఐ (ఎంఎల్) 20 స్థానాలు.. వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ 12.. సీపీఎం 4 .. ఇండియన్ ఇన్ క్లూజివ్ పార్టీ -3, జనశక్తి జనతాదళ్ -1 పోటీకి దిగాయి. 

Read more: రెబల్ స్టార్ ప్రభాస్ ఇంటిని చూశారా.. ఏకంగా మాహిష్మతిని తలదన్నేలా ఉన్న రాజా సాబ్ భవనం..!

Read more: ప్రభాస్ ఆస్తుల విలువ ఎన్ని వేల కోట్లో తెలుసా..! అస్సెట్స్ విషయంలో నిజంగానే బాహుబలి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News