ప్రియుడి మోజులో కన్నబిడ్డనే కిరాతకంగా చంపేసింది...!!

                                                

Last Updated : Feb 19, 2019, 05:28 PM IST
ప్రియుడి మోజులో కన్నబిడ్డనే కిరాతకంగా చంపేసింది...!!

తమిళనాడులో దారుణ  ఘటన చోటు చేసుకుంది.  ఓ మహిళ ప్రియుడి మోజులో పడి తన కన్నబిడ్డనే కిరాతకంగా చంపేసింది. తనకు ఏమీ తెలియనట్లు నాటకం ఆడింది. అయితే పోలీసుల విచారణలో అసలు నిజయం బయటపడింది.  పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో తానే హత్య చేశానని ఒప్పుకుంది. కన్నబిడ్డను అంత్యంత కిరాతంగా హతయార్చిన ఆ మహిళతో పాటు దీంతో ప్రియుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కటకటాల వెనక్కు నెట్టారు

ఏడేళ్ల క్రితం పెళ్లి...

పోలీసుల ప్రకారం వేలూరులో జిల్లాలోని వాణియంబాడి నేతాజీనగర్‌కు చెందిన నళిని (26) కి  బెంగళూరుకు చెందిన శివకుమార్ కు ఏడేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు కుమారులు జీవిత్(6), జస్వంత్(5)తో పాటు ఏడాదిన్నర వయస్సున్న రిత్విక అనే కుమార్తె ఉంది. 

విభేదాలతో విడిపోయిన దంపతులు

భార్యా భర్తల మధ్య విభేదాలు రావడంతో గత కొంతకాలం నుంచి నళిని తన  పుట్టింట్లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో నళినికి చెన్నైకి చెందిన మురళి అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో వీరిద్దరూ వాణియంబాడిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని కన్నకుమార్తెను కిరాతకంగా చంపేసింది.

దారుణం ఇలా బయటపడింది..
రెండ్రోజుల క్రితం రిత్విక అనారోగ్యం పాలయింది. దీంతో చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి మరణించింది. అయితే చికిత్స సమయంలో పాప శరీరంపై గాయాలు ఉండటాన్ని గమనించిన వైద్యులు ..ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు చిన్నారి మరణంపై విచారణ ప్రారంభించారు.

విచారణలో భాగంగా పాప గాయాలపై తల్లిని ప్రశ్నించారు. తొలుత తనకు ఏమీ తెలయదని బుకాయించిన నళిని.. అధికారులు తమదైన శైలిలో విచారించడంతో తానే ఈ హత్య చేశానని ఒప్పుకుంది. ఇద్దరం చెన్నైకి వెళ్లిపోయి బతుకుదామనీ... పాప వద్దని మురళి చెప్పడంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు భోరున విలపించింది. దీంతో నిందితురాలు నళినితో పాటు ప్రియుడు మరళిని  అరెస్ట్ చేసిన పోలీసులు కటకటాల వెనక్కు నెట్టారు

Trending News