Delimitation: నో డీ లిమిటేషన్, చెన్నై భేటీలో 7 పాయింట్లతో తీర్మానం

Delimitation: చెన్నై వేదికగా జరిగిన తొలి డీ లిమిటేషన్ సమావేశం ముగిసింది. దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధులతో పాటు ఉత్తరాది నుంచి పంజాబ్ ముఖ్యమంత్రి హాజరయ్యారు. మొత్తం 7 పాయింట్లతో కీలక తీర్మానాన్ని ఆమోదించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 22, 2025, 07:30 PM IST
Delimitation: నో డీ లిమిటేషన్, చెన్నై భేటీలో 7 పాయింట్లతో తీర్మానం

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో జరిగిన భేటీ ముగిసింది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల డీ లిమిటేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సమావేశానికి వైఎస్ జగన్ హాజరు కాకపోయినా తన వైఖరిని స్పష్టం చేశారు. 

Add Zee News as a Preferred Source

చెన్నైలో జరిగిన తొలి డీ లిమిటేషన్ భేటీ ముగిసింది. జనాభా ప్రాతిపదికన చేపడుతున్న నియోజకవర్గాల పునర్విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలో మొదటి డీ లిమిటేషన్ భేటీ జరిగింది. ఈ భేటీకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ హాజరయ్యారు. కర్ణాటక తరపున డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, బీఆర్ఎస్ నేత కేసీఆర్ ఇతర దక్షిణాది నేతలు హాజరయ్యారు. ఏపీ నుంచి వైసీపీ అధినేత వైఎస్ జగన్ హాజరు కాకపోయినా తన అభిప్రాయాన్ని లేఖ ద్వారా స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేయవద్దని, దామాషా ప్రాతిపదికన చేయాలని కోరుతూ ప్రధాని మోదీకు లేఖ రాయడమే కాకుండా ఆ లేఖ సారాంశాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు పంపించారు. 

డీ లిమిటేషన్‌పై ఇవాళ జరిగిన తొలి జాయింట్ యాక్షన్ కమిటీ భేటీలో నేతలంతా 7 పాయింట్ల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. డీ లిమిటేషన్ ప్రక్రియను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయపార్టీలు, భాగస్వామ్యులతో పూర్తిగా చర్చించిన తరువాతే చేపట్టాలని జేఏసీ స్పష్టం చేసింది. 

చెన్నై సమావేశం తీర్మానం ఇదే

ప్రజాస్వామ్యం స్వభావాన్ని మెరుగుపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే డీ లిమిటేషన్ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి. అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, భాగస్వామ్యులతో చర్చించాలి. జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలు చేయడంతో జనాభా తగ్గించుకున్న రాష్ట్రాలను శిక్షించకూడదు. దీనికోసం అవసరమైన రాజ్యాంగ సవరణ చేయాలి. 42,84, 87 రాజ్యాంగ సవరణల ప్రకారం జనాభా నియంత్రణ చర్యల్ని సమర్ధవంతంగా అమలు చేసిన రాష్ట్రాల్ని ప్రోత్సహించే చర్యలు తీసుకోవాలి. జనాభా స్థిరీకరణ లక్ష్యం ఇంకా నెరవేరనందున 1971 జనాభా లెక్కల ఆధారంగా మరో 25 ఏళ్లు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టకూడదు.
ఈ అంశాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం డీ లిమిటేషన్ కసరత్తు ప్రారంభించే జాయింట్ యాక్షన్ కమిటీ అందుకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఎంపీల కోర్ కమిటీ పార్లమెంటరీ భేటీలో ప్రధాని మోదీకు ఈ అంశాలతో ప్రాతినిధ్యం సమర్పించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న రాజకీయ పార్టీలు తమ తమ రాష్ట్రాల్లోని శాసనసభల్లో తీర్మానాలు చేసేందుకు ప్రయత్నిస్తాయి. 

Also read: Telangana Government: నిరుద్యోగులకు గ్రేట్ న్యూస్, త్వరలో 11 వేల జీపీవో పోస్టుల భర్తీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News