
Nagpur violence police imposed curfew: ఇటీవల మరాఠా యోధుడు శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఛావా మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇందులో విక్కి కౌశాల్ శంభాజీ పాత్రను, యేసుబాయ్ పాత్రలో రష్మిక నటించారు. ఈ సినిమాను లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించారు. ఈ క్రమంలో చావా మూవీలో క్లైమాక్స్ లో ఔరంగాజేబ్ శంభాజీ మహారాజ్ ను చిత్రహింసలకు గురిచేసి హతమార్చాడు.
ఈ సినిమా చూసిన వారంత చాలా ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా క్లైమాక్స్ చూసి దాదాపుగా.. అందుకు కన్నీళ్లను పెట్టుకున్నారు. ఇలాంటి గొప్ప యోధుడి కథను తమకు తెలియకుండా చరిత్ర కారులు తొక్కిపెట్టారని చాలా మంది సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు.
Violence erupted between two communities in #Nagpur when the hindutva groups burned the effigy of #Aurangzeb & a sheet with Quranic verses. It led to violence & arson.pic.twitter.com/Y2p191G9mj
— Aasif Mujtaba (@MujtabaAasif) March 17, 2025
మరికొందరు ఔరంగాజేబ్ గురించిపుస్తకాల్లో పెట్టి , శంభాజీ గురించి ఎందుకు పెట్టలేదని కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మరోవైపు.. ఇటీవల మహారాష్ట్రలో శంభాజీ నగర్ జిల్లాలో ఖల్దాబాద్ జిల్లాలో ఔరంగాజేబ్ సమాధి ఉంది. అయితే.. ఇప్పటికే దీన్ని తొలగించాలని కూడా పలువురు నేతలు డిమాండ్ చేశారు. కొన్నిరోజులుగా ఔరంగాజేబ్ సమాధి వివాదం మహరాష్ట్రలో వివాదాస్పదంగా మారింది. దీనిపై తొలించాలని డిమాండ్ లు భారీగా వస్తున్నాయి.
ఇప్పటికే ఔరంగాజేబ్ సమాధిని తొలగించాలని వీహెచ్ఫీ ప్రభుత్వానికి లేఖలు సైతం రాసింది. ఈ నేపథ్యంలో ఔరంగాజేబ్ సమాధి అంశంలో నాగ్ పూర్ లో పలు ప్రాంతాలలో రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. ముఖ్యంగా.. కొత్వాలి, గణేశ్ పేట్, లకడ్ గంజ్, పచ్చా వులి, శాంతి నగర్, సక్కర్ దర, నందన్ వన్, ఇమామ్వాడ, యశోధర, కపిల్ నగర్ లలో చాలా గొడవలు జరిగాయి. నిన్న రాత్రి... నాగ్ పూర్ లోని హంసపురిలో రెండు వర్గాలు కొట్టుకున్నారు. దీనిలో 20 మంది గాయపడ్డారు.
రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. నాగ్ పూర్ లోని పలు ప్రాంతాలలో పోలీసులు కర్ఫ్యూ విధించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎవరు కూడా బైటకు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు.. శంభాజీ నగర్ జిల్లాలోని ఖల్దాబాద్ లోని ఔరంగాజేబు సమాధిని చూడాలంటే.. ఇక మీదట టూరిస్టులు గుర్తింపు పత్రాలను చూపించి.. అక్కడ ఉన్న రిజిస్టర్ లో సంతకం చేసి లోపలికి వెళ్లాలని కోత్త రూల్ ను పాటించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఔరంగా జేబ్ సమాధి వివాదం తెనెపట్టులా ఉందని చెప్పుకొవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe