Yogi Adityanath: యోగి ఆదిత్యనాథ్ గొప్ప మనసు.. ఖైదీలకు కూడా కుంభమేళ పుణ్య స్నానాలు.. వీడియో వైరల్..

Maha kumbh mela: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. యూపీ వ్యాప్తంగా ఉన్న జైళ్లలో ఉన్న ఖైదీలకు కూడా త్రివేణి సంగమం పుణ్యస్నానాలు చేసే విధంగా చర్యలు తీసుకొవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Feb 19, 2025, 08:32 PM IST
  • యూపీ సీఎం కీలక నిర్ణయం..
  • ఆనందంలో ఖైదీలు..
Yogi Adityanath: యోగి ఆదిత్యనాథ్ గొప్ప మనసు..  ఖైదీలకు కూడా కుంభమేళ పుణ్య స్నానాలు.. వీడియో వైరల్..

triveni sangam water for across 75 jails 90000 inmates: ప్రయాగ్ రాజ్ కుంభమేళ ముగింపునకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. దీంతో ప్రతి రోజు కుంభమేళకు వస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళ ఫిబ్రవరి 26 తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 26న మహాశివరాత్రి షాహీస్నానంను నిర్వహించనున్నారు. ఇప్పటికే కుంభమేళలో 56 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారని.. మరికొన్ని రోజులు మిగిలి ఉన్నాయి.. దీని సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని యూపీ సర్కారు ప్రకటించింది.

Add Zee News as a Preferred Source

 

ఈ క్రమంలో కుంభమేళకు వస్తున్న వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. యూపీ సర్కారు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. అయితే.. సీఎం యోగి ఆదిత్యనాథ్ తనదైన విధంగా మంచి మనసు చాటుకున్నారు. ఎక్కడెక్కడి వాళ్లో కుంభమేళకు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలో.. యూపీలో జైళ్లో ఉన్న ఖైదీలకు పుణ్యస్నానాలు చేసే విధంగా ఏర్పాట్లు చేస్తే ఎలా ఉంటుందని యూపీ సీఎం యోగి భావించారు.

సాధారణంగా జీవితంలో అనుకొని విధంగా చాలా మంది  కొంత మంది తప్పులు చేసి జైళ్లకు వెళ్తుంటారు. కొంత మంది కావాలని చేస్తే, మరికొందరు రెప్పపాటులో ఆవేశంలో దారుణాలు చేసి జైళ్లకు వెళ్తుంటారు. అయితే.. కుంభమేళ నీళ్ల పవిత్ర స్నానం పుణ్యం వారికి కల్గే విధంగా యూపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.

Read more: Baba Ramdev Video: 59 ఏళ్ల వయసులో గుర్రం కన్నా స్పీడ్‌గా రన్నింగ్ చేస్తున్న రామ్ దేవ్ బాబా.. వీడియో వైరల్..

యూపీ వ్యాప్తంగా ఉన్న 75 జైళ్లో ఉన్న దాదాపు.. 99 వేల మంది ఖైదీలకు త్రివేణి సంగమం పుణ్యస్నానం కలిగే విధంగా చర్యలు తీసుకొవాలని అధికారుల్ని ఆదేశించింది. దీనిలో భాగంగా ఇటీవల ఉన్నావ్ జైలు అధికారులు..కుంభమేళ నీళ్లను.. జైలు ఖైదీలు స్నానం చేసే పెద్ద నీటీ తొట్టెలో కలిపారు. దీంతో  ఆ నీళ్లన్ని కూడా కుంభమేళ నీళ్లుగా మారిపోయాయి. దీనిలో ఖైదీలంతా కూడా పుణ్యస్నానాలు ఆచరించారు. ఇదే విధంగా యూపీ వ్యాప్తంగా జైలులోకి ఖైదీలంతా పుణ్యస్నానాలు చేసేలా చూడాలని యూపీ సీఎం యోగి ఆదేశించారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్గా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News