)
Kanhaiya Kumar slams on cm revanth reddy over bihar dna remarks row video: బీహర్ అసెంబ్లీ ఎన్నికలు ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ మారాయి. ఇప్పటికే అన్ని పార్టీలకు చెందిన పార్టీలు తమ తమ వ్యూహలతో ముందుకు వెళ్తున్నాయి. ఎలాగైన బీహర్ లో పాగావేయాలి బీజేపీ ప్రయత్నాలు చేస్తుండగా, మరోవైపు కాంగ్రెస్ కూడా భారీగా సీట్లు గెల్చుకొని అధికార బీజేపీకి చుక్కలు చూపించాలని భావిస్తుంది.
ఈ క్రమంలో ప్రస్తుతం బీహర్ అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీహర్ ప్రజలపై చేసిన కామెంట్లు అగ్గినిరాజేస్తున్నాయి. బీహర్ ప్రజల డీఎన్ఏ గురించి రేవంత్ రెడ్డి తక్కువ చేసి మాట్లాడారు. దీనిపై ఇప్పటికే బీహరీలు సీరియస్ గా ఉన్నారు. ఎన్నికల వ్యూహకర్త దీనిపై రేవంత్ కు గట్టిగా ఏపీపారేశారు.
రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డ కాంగ్రెస్ నేత కన్నయ్య కుమార్
రేవంత్ రెడ్డి ఒక మూర్ఖుడు.. తెలివితక్కువ వాడు
బీహార్ ప్రజలను కూలీలు అని ఎలా అంటాడు
దొంగతనం చేసే వారిని దొంగలు అని అంటారు.. తెలివి లేకుండా మాట్లాడే వారిని మూర్ఖుడు అని అంటారు
రేవంత్ రెడ్డి మా పార్టీ సీఎం అయినా మూర్ఖుడే… pic.twitter.com/bcHxFWQVMc
— Telugu Scribe (@TeluguScribe) October 4, 2025
పార్టీలు మారి సీఎం అయినంత మాత్రన బీహరీలను రేవంత్ అంత మాట అంటాడా .?. మండిపడ్డారు. గతంలో తమ దగ్గర ఎన్నికల వ్యూహల కోసం మరి ఎందుకు వచ్చాడని, రేవంత్ పై, రాహుల్ గాంధీ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో తప్పకుండా రేవంత్ వ్యాఖ్యలకు గట్టిగా బుద్ది చెబుతామన్నారు. సీఎం రేవంత్ ను తెలంగాణ గడ్డపై ఓడించి తమ తడాఖా చూపిస్తామన్నారు. అయితే.. తాజాగా.. కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ సైతం రేవంత్ రెడ్డిపై మరో బాంబు పేల్చారు.
రేవంత్ రెడ్డి ఒక మూర్ఖుడు అని.. తెలివితక్కువ వాడంటూ ఏకీపారేశారు. బీహార్ ప్రజలను కూలీలు అని ఎలా అంటాడని, వారి డీఎన్ఏ అంటూ కాంట్రవర్సీగా మాట్లాడటంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
దొంగతనం చేసే వారిని దొంగలు అని అంటారు.. తెలివి లేకుండా మాట్లాడే వారిని మూర్ఖుడు అని అంటారన్నారు. రేవంత్ రెడ్డి మా పార్టీ సీఎం అయినా మూర్ఖుడే అని అంటానని. . దీనికి. నేను భయపడేదిలేదని కాంగ్రెస్ నేత, ఏఐసీసీ ఇంచార్జ్ కన్నయ్య కుమార్ తెల్చి చెప్పారు.
ప్రస్తుతం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒకవైపుకు రచ్చగా మారుతుండగా మరోవైపు సొంత పార్టీకి చెందిన నేతలు సైతం రేవంత్ ఇజ్జత్ తీస్తుండటంతో ఈ అంశం రాజకీయాంగా హాట్ టాపిక్ గా మారింది.
మరోవైపు దీన్ని బీఆర్ఎస్ నేతలు.. రేవంత్ కు సొంత పార్టీలోనే పరువులేదని, దొంగ అంటున్నారని గతంలో ఓటుకు నోటు అంశంతో ముడిపెట్టి దీన్ని వైరల్ చేస్తున్నారు. మొత్తంగా బీహర్ ఎన్నికల వేళ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయని చెప్పుకొవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook