Bharat Summit: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన భారత్ సమ్మిట్లో భారత దేశానికి ఘోర అవమానం జరిగింది. దేశంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో చిరకాల వైరం ఉన్నా కాంగ్రెస్ పార్టీ.. ఎవరిని సంతృప్తి పరచాలనో ఇలా కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్ ప్రదర్శించడంపై దేశ ప్రజలు కాంగ్రెస్ తీరుపై మండిపడుతున్నారు. అంతేకాదు ఇలాంటి నీచమైన పనులు చేసిన కాంగ్రెస్ పార్టీ వెంటనే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలనే డిమాండ్ నెటిజన్స్ నుండి వ్యక్తమవుతోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన భారత్ సమ్మిట్లో భారత దేశానికి ఘోర అవమానం
తెలంగాణలో జరిగిన భారత్ సమ్మిట్లో POK మరియు లడక్ లేకుండా భారతదేశ మ్యాప్ని ఉపయోగించిన కాంగ్రెస్ ప్రభుత్వం
100 దేశాలకు పైగా ప్రముఖులు హాజరైన ఈ సమ్మిట్లో ఇలా చేయటం దేశ ద్రోహం కింద పరిగణించాలని డిమాండ్ pic.twitter.com/mOKX4FKR0W
— Telugu Scribe (@TeluguScribe) April 25, 2025
దాదాపు ప్రపంచంలోనే 100 దేశాలకు పైగా ప్రముఖులు పాల్గొన్న ఈ సమ్మిట్లో ఇలా భారత్ మ్యాప్ ను పాక్ ఆక్రమిత జమ్ము కాశ్మీర్, లడ్డాక్ లేకుండా దేశ పటాన్ని చూపించడాన్ని దేశ ద్రోహం కింద పరిగణించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా జమ్ము కాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ సరిహద్దులో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్వహించిన HICC సదస్సులో ఈ మ్యాప్ ప్రదర్శించడం అందరు తప్పుపడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎపుడు దేశ వ్యతిరేక , ప్రజా వ్యతిరేఖ స్వభావాన్ని ఇది బహిర్గతం చేసిందని బీజేపీ నేతలు తీవ్రంగా దుయ్యబట్టారు. ఇది కేవలం రాజకీయ నిర్లక్ష్యం కాదు. కాంగ్రెస్ పార్టీ ఖండ కావరాన్ని సూచిస్తుందన్నారు. ఇది జాతీయ ద్రోహం. కాంగ్రెస్ పార్టీ లడఖ్, PoJKలను ఉద్దేశపూర్వకంగా మినహాయించిన మ్యాప్ను ప్రదర్శించిందన్నారు. ఇది భారతదేశంలో అంతర్భాగాలుగా కాంగ్రెస్ పార్టీ పరిగణించడం లేదనే విషయాన్ని స్పష్టం చేస్తుంన్నారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఈ పటాన్ని ప్రదర్శించడాన్ని భారత దేశ సార్వభౌమాధికారంపై ప్రత్యక్ష్య దాడిగా అభివర్ణిస్తున్నారు.
ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..
ఇదీ చదవండి: ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.