
Coronavirus Threat: కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 ఇప్పుడు ఇండియాను భయపెడుతోంది. సింగపూర్, హాంకాంగ్ తరువాత దేశంలో కలవరం రేపుతోంది. జూన్ 1 నాటికి దేశంలో 4 వేల కోవిడ్ యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. నాలుగు రోజుల్లో రెట్టింపు కేసులు నమోదవుతున్న పరిస్థితి కన్పిస్తోంది. అందుకే కేంద్ర ప్రభుత్వ సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అలర్ట్ జారీ చేశాయి.
కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్నఅంటే జూన్ 1 నాటికి దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 3985 నమోదయ్యాయి. మే 22 నాటికి దేశవ్యాప్తంగా కేవలం 260 కేసులుంటే కేవలం నాలుగు రోజుల్లో అంటే మే 26 నాటికి 1100 కు చేరుకుంది. అంటే కేవలం నాలుగు రోజుల వ్యవధిలో 1200 శాతం పెరుగుదల కన్పించడం ఆందోళన కల్గిస్తోంది. కరోనా కేసుల పెరుగుదల, వ్యాప్తి నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ప్రత్యేక అలర్ట్ జారీ చేశాయి. ప్రజల్ని మరోసారి కోవిడ్ మార్గదర్శకాలు పాటించాల్సిందిగా సూచించాయి. వైద్యాధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్క్ తప్పనిసరిగా ధరించడం చేయాలని అంటున్నాయి. అదే సమయంలో వృద్ధులు, గర్భిణీలు ఇళ్లలోనే ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ జారీ చేశాయి.
దేశంలో ప్రస్తుతం అత్యధికంగా కరోనా కేసులు కేరళలో నమోదవుతున్నాయి. ఆ తరువాత మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. కేరళలో 189 కేసులు నమోదు కాగా యాక్టివ్ కేసుల సంఖ్య 1336 ఉంది. మహారాష్ట్రలో 467 యాక్టివ్ కేసులుంటే ఢిలీలో 375 కేసులు, గుజరాత్ లో 265 కేసులు ఉన్నాయి. కర్ణాటకలో 235 కేసులు, పశ్చిమ బెంగాల్ లో 205, తమిళనాడులో 185, ఉత్తర ప్రదేశ్ లో 117 కేసులు నమోదయ్యాయి. ఇక రాజస్థాన్ లో 60, పుదుచ్చేరిలో 41, హర్యానాలో 26, ఏపీలో 1, ఎంపీలో 16 కోవిడ్ యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ కేసులు గత 24 గంటల్లో 700 నమోదు కాగా నలుగురు మరణించారు. గత ఏడాది అంటే 2024లో కోవిడ్ కారణంగా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ భారతదేశం, పశ్చిమ ప్రాంతాల్లో సేకరించిన కరోనా వైరస్ నమూనాల ప్రకారం కొత్త వేరియంట్లు బయటపడినట్టు ఐసీఎంఆర్ తెలిపింది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో సంచరించేటప్పుడు మాస్క్ తప్పకుండా ధరించాలని సూచిస్తున్నారు. శానిటైజర్ తప్పకుండా వాడాలని హెచ్చరిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
మా సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook