)
Delhil bombblast Secret Operation: ఈ వ్యవహారంలో అరెస్టైన వైద్యులు రహస్య సమాచార మార్పిడి కోసం డెడ్-డ్రాప్ (Dead Drop) ఈ-మెయిల్స్ విధానం వాడినట్లు అనుమానిస్తున్నారు. ఉగ్రవాద గ్రూపులు, అంతర్జాతీయ నిఘా సంస్థలు ఈ విధానాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటాయి.
ఏమిటీ డెడ్ డ్రాప్..?
ఏదైనా నెట్వర్క్లో లేదా రెండు పార్టీలు.. రహస్యంగా సమాచార మార్పిడి కోసం ఒకే మెయిల్-ఐడీని ఉపయోగిస్తారు. ఈ విధానంలో వారి ప్లాన్లను డ్రాఫ్ట్ ఫోల్డర్లో సేవ్ చేస్తారు. అదే సమయంలో అవతలి వ్యక్తి అదే ఈ మెయిల్ను తెరిచి చదవడం, అప్డేట్ లేదా డిలీట్ చేస్తారు. ఇక్కడ ఈ-మెయిల్ పంపించడం, రిసీవ్ చేసుకోవడం అనేది ఉండదు. దీంతో డిజిటల్ కార్యకలాపాలను గుర్తించడం చాలా కష్టం. దీన్నే డెడ్-డ్రాప్ ఈ-మెయిల్ టెక్నిక్గా వ్యవహరిస్తుంటారు. నిఘా కళ్లకు చిక్కకుండా ఉండేందుకు ఉగ్ర సంస్థలు, నిఘా విభాగాలు, మాదకద్రవ్య నెట్వర్క్లు ఎక్కువగా ఈ విధానాన్ని ఫాలో అవుతుంటాయి.
కోల్డ్వార్ సమయంలోనూ..
డెడ్ డ్రాప్ అనే పదాన్ని గూఢచార పరిభాషలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఆనవాళ్లు లేకుండా కార్యకలాపాలు కొనసాగించడం దీని ముఖ్య ఉద్దేశం. ముఖాముఖిగా కాకుండా సమాచారం లేదా వస్తువులను రహస్యంగా పంపించేందుకు దీన్ని వాడతారు. కోల్డ్వార్ సమయంలో ఏజెంట్ల మధ్య సమాచారం, ఆదేశాలు లేదా వస్తువులు పంపించేందుకు ఈ రహస్య పద్ధతిని విస్తృతంగా ఉపయోగించారు. మాదకద్రవ్య వ్యాపారంలోనూ ఈ విధానాన్ని ఫాలో అవుతుంటారు. ముందుగా నిర్దేశించుకున్న రహస్య ప్రదేశంలో వ్యక్తి ఓ వస్తువును పెట్టి వెళ్లిపోతే.. దాన్ని అవతలి వ్యక్తి తీసుకుంటాడు. వీరిద్దరి మధ్య నేరుగా సంభాషణ ఉండదు.
విద్యార్థులు ఇంటిబాట.. ఆ యూనివర్సిటీలో ఏం జరుగుతోంది?
సమాచారం మార్పిడి, నిల్వ కోసం ఇస్లామిక్ స్టేట్, అల్-ఖైదా, అల్ షబాబ్ వంటి సంస్థలు ఆన్లైన్ డెడ్ డ్రాప్ను ఉపయోగిస్తున్నాయి. సెప్టెంబర్ 11 దాడులకు ప్రణాళికలు రచించిన మహ్మద్ అట్టా, రాంజీ బినాల్షిబ్ ఒకే హాట్మెయిల్ అకౌంట్ను వాడినట్లు తేలింది. మాడ్రిడ్ రైలు బాంబు దాడుల కుట్రదారు హసన్ ఎల్ హస్కీ అతడి సహచరులు డ్రాఫ్ట్ ఫోల్డర్ కోసం యాహూ, హాట్మెయిల్ అకౌంట్లను వాడినట్లు తెలిసింది. ముంబయి దాడుల కుట్రకు మాస్టర్మైండ్ డేవిడ్ హెడ్లీ కూడా రహస్య సమాచార మార్పిడి కోసం డెడ్ డ్రాప్ ఉపయోగించాడు.
స్విస్ యాప్ త్రీమా..
స్విస్ కమ్యూనికేషన్ యాప్ ‘త్రీమా’, టెలిగ్రామ్ వంటి వ్యవస్థల్లో సమాచార మార్పిడి పూర్తి ఎన్క్రిప్షన్తో కూడి ఉంటుంది. త్రీమా యాప్ను వాడాలనుకునేవారు దానికోసం ఫోన్ నంబరు లేదా ఈ-మెయిల్ ఐడీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అందువల్ల దీన్ని ట్రేస్ చేయడం కష్టం. రహస్యంగా సమాచారాన్ని ప్రైవేటు సర్వర్ల ద్వారా అందిస్తుంది. ఈ సమాచారం ఎక్కడా నిక్షిప్తం కాదు. అందువల్ల ఫోరెన్సిక్ నిపుణులకు దొరకదు. దిల్లీ దాడి కేసులో ప్రధాన నిందితులైన డాక్టర్ ఉమర్ నబీ, డాక్టర్ ముజమ్మిల్ గనాయి, డాక్టర్ షాహీన్ షాహిద్లు సమాచారాన్ని, మ్యాపులను పంచుకునేందుకు ఒకే ఈ-మెయిల్ అకౌంట్ను వినియోగించినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. వీటితోపాటు త్రీమా యాప్ను వాడినట్లు భావిస్తున్నారు.
జీ న్యూస్ తెలుగు సౌజన్యంతో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.