Delhi Red Fort Blast update: దేశ రాజధాని ఢిల్లీ భారీ పేలుడు ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 10 కి చేరుకుంది. పేలుడుపై అన్ని కోణాల్లో పోలీసులు, నిఘా సంస్థలు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సమయంలో పోలీసులు కీలక అంశాన్ని గుర్తించారు. ప్రమాద స్థలంలో తగలబడుతున్న కార్లలో CNG ట్యాంకులను పోలీసులు గుర్తించారు. ఈ ట్యాంకులను స్వాధీనం చేసుకుని, పరిశీలిస్తున్నారు. పేలుడు కారణాలను అన్వేషిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఓ అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేసి.. విచారిస్తున్నారు. ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం సహా క్లూస్ టీమ్, ఎన్ఐఏ రంగంలోకి దిగాయి.
కారులో ఉంచిన పేలుడు పదార్థాలను దూరం నుంచి ఎవరైనా రిమోట్ కంట్రోల్ సాయంతో పేల్చి ఉంటారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ పేలుడు ఘటనలో కారును జమ్మూ కశ్మీర్ పుల్వామా జిల్లాకు చెందిన తారిఖ్ కొన్నట్టు నిర్ధారణ అవ్వడంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుంది. పేలుడు ఘటన వెనక అతన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోంది. ఇప్పటివరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ లో ఈ కేసుకు ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యుల్కి సంబంధముందని బయటపడింది.
ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ఆ ఐ-20 కారులో డాక్టర్ ఉమర్ మహ్మద్ ప్రయాణిస్తున్నాడని అనుమానిస్తున్నారు. మరోవైపు కారులో మరణించిన వ్యక్తి ఎవరో వెరిఫై చేసేందుకు పోలీసులు డిఎన్ఏ పరీక్ష నిర్వహించనున్నారు. దీంతో చనిపోయిన ఆ వ్యక్తి డాక్టర్ ఉమర్ మహ్మద్నా కాదా అనే విషయం తేలనుంది. ఫరీదాబాద్ మాడ్యుల్కు చెందిన ఉగ్రవాది డాక్టర్ ఉమర్ మహ్మద్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఇంటెలిజెన్స్ బ్యూరోతో పాటు ఢిల్లీ స్పెషల్ పోలీసులు, రా, మిలటరీ సంయుక్తం ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.
Also Read: మీ ఏజ్ ప్రకారం రోజు ఎంత లిక్కర్ తీసుకోవాలి.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..
Also Read: చిరంజీవికి అమ్మగా.. అక్కగా.. చెల్లిగా..భార్యగా యాక్ట్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.









