Delhi Blast: 14ఏళ్లలో తొలిసారి.. ఢిల్లీ పేలుడు వెనుక సంచలన నిజాలు..!!

Delhi Terror Blasts History: నవంబర్ 10వ తేదీ సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో చోటుచేసుకున్న కారు బాంబు పేలుడులో కనీసం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో దేశ రాజధాని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 14 సంవత్సరాల తర్వాత ఢిల్లీ మళ్లీ ఇలాంటి భయానక దృశ్యాలను చూసింది. చివరిసారిగా 2008లో దేశ రాజధానిలో వరుస పేలుళ్లు సంభవించాయి. దేశ పరిపాలనా కేంద్రంగా నిలిచిన ఢిల్లీ, భద్రతా వ్యవస్థ, ప్రజాస్వామ్య స్థిరత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. అయితే గత నాలుగు దశాబ్దాలుగా దేశ రాజధాని ఉగ్రదాడులతోపాటు.. భీభత్స సంఘటనలను ఎదుర్కొంది.

Written by - Bhoomi | Last Updated : Nov 10, 2025, 10:39 PM IST
Delhi Blast: 14ఏళ్లలో తొలిసారి.. ఢిల్లీ పేలుడు వెనుక సంచలన నిజాలు..!!

Add Zee News as a Preferred Source

Delhi Terror Blasts History: నవంబర్ 10వ తేదీ సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో చోటుచేసుకున్న కారు బాంబు పేలుడులో కనీసం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో దేశ రాజధాని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 14 సంవత్సరాల తర్వాత ఢిల్లీ మళ్లీ ఇలాంటి భయానక దృశ్యాలను చూసింది. చివరిసారిగా 2008లో దేశ రాజధానిలో వరుస పేలుళ్లు సంభవించాయి. దేశ పరిపాలనా కేంద్రంగా నిలిచిన ఢిల్లీ, భద్రతా వ్యవస్థ, ప్రజాస్వామ్య స్థిరత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. అయితే గత నాలుగు దశాబ్దాలుగా దేశ రాజధాని ఉగ్రదాడులతోపాటు.. భీభత్స సంఘటనలను ఎదుర్కొంది.

1985: స్వాతంత్ర్యం తర్వాత తొలి పెద్ద ఉగ్రదాడి:

1985 మే 10న ఢిల్లీలో ఒకేసారి అనేక ప్రాంతాల్లో ట్రాన్సిస్టర్ బాంబులు పేలాయి. బస్సులు, మార్కెట్లు, బహిరంగ ప్రదేశాలు లక్ష్యంగా మారాయి. ఈ దాడుల్లో 49 మంది మరణించగా, 127 మంది గాయపడ్డారు. ఇది స్వాతంత్ర్యం తర్వాత రాజధానిలో జరిగిన తొలి పెద్ద ఉగ్రదాడిగా చరిత్రలో నిలిచింది.

1996: లజ్‌పత్ నగర్‌ దాడి:

1996 మే 21న లజ్‌పత్ నగర్ సెంట్రల్ మార్కెట్‌లో జరిగిన పేలుడు 13 మంది ప్రాణాలను బలిగొంది. ఈ దాడికి జమ్మూ–కాశ్మీర్ ఇస్లామిక్ ఫ్రంట్ బాధ్యత వహించింది. ఈ సంఘటనతో ఉగ్రవాదం ఇక సరిహద్దుల్లోనే కాకుండా, రాజధాని హృదయానికి కూడా చేరిందని నిరూపితమైంది.

Also Read: Delhi Blast: భూమి బద్ధలైతుందేమో అనుకున్నాం.. నా జీవితంలో ఇంత పెద్ద శబ్దంతో పేలుడు ఏనాడూ వినలేదు.. ప్రత్యక్ష సాక్షి..!!

2005: దీపావళికి ముందు భయానక దాడులు:

2005 అక్టోబర్ 29న, దీపావళికి కేవలం రెండు రోజుల ముందు, పహార్‌గంజ్‌, గోవింద్‌పురి, సరోజిని నగర్‌ మార్కెట్లలో ఒకేసారి పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 62 మంది మరణించగా, 210 మందికి పైగా గాయపడ్డారు. లష్కరే తోయిబాతో అనుబంధంగా ఉన్న ఒక సంస్థ ఈ దాడుల వెనుక ఉందని దర్యాప్తులో తేలింది. పండుగ సమయంలో జరిగిన ఈ దాడులు దేశాన్ని ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేశాయి.

2008: వరుస పేలుళ్లతో ఉలిక్కిపడిన హస్తిన:

2008 సెప్టెంబర్ 13న కరోల్‌బాగ్‌, కన్నాట్ ప్లేస్‌, గ్రేటర్ కైలాష్‌లలో దాదాపు ఒకేసారి ఐదు పేలుళ్లు జరిగాయి. ఈ దాడుల్లో 30 మంది మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడులకు ఇండియన్ ముజాహిదీన్ బాధ్యత వహించింది. ఆ కాలంలో జైపూర్, అహ్మదాబాద్, హైదరాబాద్‌లలోనూ ఇలాంటి దాడులు జరిగాయి. కేవలం రెండు వారాలకే, సెప్టెంబర్ 27న మెహ్రౌలి పూల మార్కెట్‌లో టిఫిన్ బాంబు పేలింది. ముగ్గురు మరణించగా, 23 మంది గాయపడ్డారు. ఆ తరువాత 2011 సెప్టెంబర్ 7న ఢిల్లీ హైకోర్టు వెలుపల బ్రీఫ్‌కేస్‌లో దాచిన బాంబు పేలడంతో మరోసారి భయం అలముకుంది.

భద్రతా వ్యవస్థ బలోపేతం:

ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ (IDSA) నివేదిక ప్రకారం, 1997 నుండి ఇప్పటివరకు ఢిల్లీలో 26 పెద్ద పేలుళ్లు సంభవించాయి. వీటిలో 92 మంది ప్రాణాలు కోల్పోయి, 600 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనల తరువాత భద్రతా సంస్థలు పలు చర్యలు తీసుకున్నాయి. మార్కెట్లలో CCTV కెమెరాలు ఏర్పాటు చేయడం, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌, NIA విభాగాలను బలోపేతం చేయడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు. అదనంగా బాంబు గుర్తింపు బృందాలు, శీఘ్ర ప్రతిస్పందన దళాలు (QRT) కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

Also Read: Delhi Blast : ఢిల్లీని కుదిపేసిన భారీ పేలుళ్లు.. 8 మంది మృతి.. కలచివేస్తున్న ఫోటోలు..!!

ఢిల్లీ తరచుగా ఎందుకు లక్ష్యం అవుతుంది?

ప్రధానమంత్రి కార్యాలయం, పార్లమెంట్‌, రాయబార కార్యాలయాలు వంటి దేశ ముఖ్య కేంద్రాలు ఢిల్లీలో ఉండటం వల్ల ఇది ఉగ్రవాదులకు ఎప్పటికీ ఆకర్షణీయమైన లక్ష్యంగా మారుతోందని చెప్పాలి. నగరంలోని భారీ జనాభా, రద్దీ మార్కెట్లు, పండుగ సీజన్‌ ఉగ్రవాదులకు ఎలుసైన టార్గెట్‌ గా మారుస్తున్నాయి. భద్రతా జాగ్రత్తలు ఎంత కఠినంగా ఉన్నా, ఒక చిన్న నిర్లక్ష్యం ప్రాణాంతకంగా మారవచ్చని ఇప్పటి ఎర్రకోట పేలుడు మరోసారి మనకు గుర్తు చేసింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News