Electricity Charges cut off: కరెంట్ ఛార్జీలు ఏటికాయేడు పెంచుకుంటూ పోవడమే కానీ.. తగ్గింపు అనే ముచ్చటే లేదు. విద్యుత్ ఉత్పత్తిలో ప్రైవేటు సంస్థలు పుట్టుకురావడంతో ప్రతి యేడు కరెంట్ ఛార్జీలు పెరుగడమే కానీ తగ్గడం అనే ప్రసక్తే ఉండటం లేదు. అలాంటి తరుణంలో మహారాష్ట్ర ప్రభుత్వం కరెంట్ ఛార్జీలను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. బహుశా మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలా కరెంట్ ఛార్జీలను తగ్గించిన దాఖలాలు లేవనే చెప్పాలి. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం తొలిసారిగా విద్యుత్ ఛార్జీలను తగ్గించే నిర్ణయం తీసుకుంది. మొదటి యేడాది 10% తగ్గింపుతో ప్రారంభమై, రాబోయే 5 యేళ్లలో దశలవారీగా 26% వరకు కరెంట్ ఛార్జీలను తగ్గించబోతున్నట్టు ప్రకటించింది.
టారిఫ్లను తగ్గించాలనే MSEDCL ( మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిడెట్) ప్రతిపాదనను ఆమోదించినందుకు మహారాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ (MERC)కి ధన్యవాదాలు తెలియజేసారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. గతంలో ఇంతకు ముందు ఎప్పుడూ కరెంట్ ఛార్జీలను తగ్గించేందకు ఎవరు చేయని చర్యగా అభివర్ణించారు.
Good news on electricity tariffs!
For the first time in the State’s history, electricity tariffs will be reduced — starting with a 10% cut in the first year, and a total 26% reduction in phases over the next 5 years.
Thanks to the Maharashtra Electricity Regulatory Commission…— Devendra Fadnavis (@Dev_Fadnavis) June 25, 2025
గతంలో విద్యుత్ సంస్థలు ఎపుడు నష్టాల్లో ఉండేవి. దీంతో అవి ప్రజలపై ఛార్జీల భారం మోపేవి. కానీ ఇపుడు ఎలక్ట్రిఫికేషన్ మ్యాడిపికేషన్ చేసిన కొంత మెరుగు అయింది. అప్పట్లో విద్యుత్ నియంత్రణ మండళ్లు 10% టారిఫ్ పెంపుదల కోసం పిటిషన్లు దాఖలు చేసేవారు. కానీ ఈసారి, తగ్గింపు కోసం పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. ఇది గృహ, పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు సరి సమానంగా ఈ ప్రయోజనం లభించనున్నట్టు పేర్కొన్నారు.
రాష్ట్రంలో దాదాపు 70% మంది వినియోగదారులు 100 యూనిట్ల కంటే తక్కువ వినియోగిస్తున్నారు. 10% టారిఫ్ కోత ద్వారా వారు ఎక్కువగా ప్రయోజనం పొందే అవకాశాలున్నాయి. అంతేకాదు విద్యుత్ సంస్థ పనితీరు మెరుగు కావడంతో రైతులకు పగటిపూటే నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. మరోవైపు ముఖ్యమంత్రి సౌర్ కృషి వాహిని యోజన 2.0 పై పని వేగంగా జరుగుతోందన్నారు. చాలా మంది రైతులు, సామాన్యులు సౌర విద్యుత్ ను వాడటంతో మిగిలిన విద్యుత్ ను వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు. మా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో పునరుత్పాదక శక్తిపై ఎక్కువ దృష్టిని కేంద్రీకరించినట్టు మహారాష్ట్ర సీఎం చెప్పుకొచ్చారు. అంతేకాదు పునరుత్పాదక విద్యుత్ తక్కువ ధరకే లభిస్తుంది. భవిష్యత్తులో కూడా థర్మల్ విద్యుత్ ను తగ్గించి జల విద్యుత్, పవన్, సౌర, ఇతర పునరుత్పాదక ఇందన వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి పైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించబోతున్నట్టు చెప్పారు. అలా ఆదా అయిన విద్యుత్ ను వినియోగదారులకు అందజేయడంలో భాగంగా టారీఫ్ లను తగ్గించడం జరిగిందన్నారు.
Also Read : చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ కలిసి నటించిన ఏకైన సినిమా తెలుసా.. !
Also Read : 16 ఏళ్ల వయసులో పెళ్లి..ఆ తర్వాత పిల్లలు..25 ఏళ్ల వయసులో విడాకులు.. ఆ తర్వాత మూవీ ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









