)
EPFO 3.0 Launch: ఈపీఎఫ్ఓ 3.0 వచ్చేసింది. ఈనెల నుంచే విత్ డ్రా చేసుకోవచ్చు. యూపీఐ యాప్స్ ద్వారా లక్ష వరకు డబ్బులు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. అంతేకాకుండా ఏటీఎం ద్వారా కూడా తీసుకునే సౌకర్యం అందుబాటులో రానుంది.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఈపీఎఫ్ఓ 3.0 లాంచ్ చేసింది. దీని ద్వారా ఖాతాదారులు ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. యూపీఐ యాప్స్ ద్వారా లక్ష రూపాయల వరకు డబ్బులు తీసుకోవచ్చు. అంతేకాకుండా ఏటీఎంల ద్వారా కూడా డబ్బులు విత్ డ్రా చేసుకునే అవకాశం అందుబాటులో రానుంది. ఈ ఫీచర్ కోసం మీరు చేయాల్సిందల్లా కేవైసీ వివరాలు అప్డేట్ చేసి యూఏఎన్ను యూపీఐ ఐడీతో లింక్ చేసుకోవాలి.
సాధారణంగా పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవాలంటే చాలా పెద్ద ప్రక్రియ. ఆన్లైన్ లో క్లెయిమ్ చేసుకుని వారం రోజులైనా నిరీక్షించాల్సి ఉంటుంది. బ్యాంక్ ఎక్కౌంట్,పేరు వంటి వివరాలు నమోదు చేయాలి. ఒకవేళ ఏదైనా కారణంతో రిజెక్ట్ అయితే మళ్లీ అప్లై చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఈపీఎఫ్ఓ 3.0 ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.
ఈపీఎఫ్ఓ 3.0 జూన్ నుంచి ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దాదాపు 7.5 కోట్ల మంది ఖాతాదారులకు పీఎఫ్ నిధులు తక్షణం బదిలీ చేసుకునే అవకాశం ఉంది. లేదా ఏదైనా ఏటీఎంలో వెళ్లి డబ్బులు విత్ డ్రా చేయవచ్చు. ఫోన్ పే, గూగుల్ పే, భీమ్ వంటి యూపీఐ యాప్స్కు లింక్ చేసుకోవచ్చు. ఓటీపీ ధృవీకరణ ఉండటంతో సెక్యూరిటీ ఉంటుంది. పీఎఫ్ బ్యాలెన్స్ను యూపీఐ యాప్ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
మా సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook