)
3 Percent DA Hike: పండుగలు వచ్చాయంటే చాలు అందరూ ఏదో ఒకటి ఆశిస్తుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు అయితే ప్రభుత్వం నుంచి ఏమైనా కానుకలు వస్తాయోమోననే ఆశల్లో ఉంటారు. సాధారణంగా దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఉద్యోగులకు భారీ గిఫ్ట్లు, ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ క్రమంలోనే త్రిపుర ప్రభుత్వం కూడా భారీ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులకు 3 శాతం కరువు భత్యం (డీఏ) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు డీఆర్ను కూడా పెంచుతూ ప్రకటన చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
దసరా పండుగ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పండుగ బొనాంజా ప్రకటించారు. దుర్గా పూజను పురస్కరించుకుని డియర్నెస్ అలవెన్స్ (డీఏ), డియర్నెస్ రిలీఫ్ (డీఆర్)లో అదనంగా 3 శాతం పెంచుతున్నట్లు సీఎం ప్రకటన చేశారు. పెంచిన డీఏ పెరుగుదల 1వ తేదీ అక్టోబర్ 2025 నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించి ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించారు. 3 శాతం పెంపుతో దాదాపు 1.05 లక్షల మంది ఉద్యోగులు, 84,000 మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది. డీఏ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.125 కోట్ల అదనపు ఖర్చు కానుంది.
తన ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తుందని సీఎం మాణిక్ సాహ తెలిపారు. జీతం, పెన్షనర్లకు సంబంధించి 7వ వేతన సంఘం (సీపీసీ) ప్రకారం సమీక్ష చేసి అమలు చేస్తున్నట్లు వివరించారు. ఉద్యోగులు, పెన్షనర్లు బాధ్యత తమదని.. వారి డిమాండ్లు లేవనెత్తకముందే తాము పరిష్కరిస్తామని తెలిపారు. ఆరు విడతలుగా డీఏ, డీఆర్ పెంపుదల అమలు చేసినట్లు.. మొత్తం 33 శాతం పెంపుదల చేసినట్లు సీఎం మాణిక్ సాహ వెల్లడించారు. ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన ప్రకటనతో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులు సంబరాల్లో మునిగారు.
దసరా, దీపావళి పండుగ ముందు ప్రభుత్వం తమకు తీపి కబురు అందించిందని.. ఇక పండుగ సంతోషంగా చేసుకుంటామని ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. పెంచిన డీఏ, డీఆర్తో తమకు ఆర్థికంగా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వ ఉద్యోగులు చెబుతున్నారు. అడగకముందే డీఏను పెంచిన సీఎం మాణిక్ సాహాకు ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులు కృతజ్ఞతలు చెప్పారు. మిగిలిన సమస్యలను కూడా ప్రభుత్వం మానవతా దృక్పథంతో పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక తెలంగాణ, ఏపీలో కూడా ప్రభుత్వాలు డీఏ పెంపును ప్రకటించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook