)
Karnataka: కర్నాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ ను ఆయన భార్య పల్లవి, కుమార్తె కృతి పథకం ప్రకారం కడతేర్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. తానే హత్య చేసినట్లు పల్లవి అంగీకరించారు. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. హత్యలో క్రుతి పాత్రపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఈ దారుణ ఘటనపై ఓం ప్రకాశ్ కుమారుడు కార్తీక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్మా, నాన్న మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. అమ్మ పోరు పడలేక నాన్న కొన్నాళ్లుగా మా అత్త ఇంట్లో ఉంటున్నారు. అమ్మ ఫోన్లో కూడా నాన్నను వేధిస్తుండేది. మూడు రోజుల క్రితం చెల్లి కృతి మా అత్త ఇంటికి వెళ్ల నాన్నను ఇంటికి రమ్మని ఒత్తిడి చేసింది.
దీంతో నాన్న ఇష్టంలేకున్నా ఇంటికి వచ్చారు. ఇంతలోనే దారుణం జరిగిపోయింది. ఆదివారం మధ్యాహ్నం నేను గోల్ఫ్ అసోసియేషన్ ఆఫీస్ దగ్గర ఉండగా పొరుగింటి నుంచి నాకు ఒకరు ఫోన్ చేసి మీ నాన్న కిందపడి ఉన్నారని చెప్పారు. ఇంటికి వెళ్లి చూసేసరికి నాన్న రక్తపు మడగులో ఉన్నారు. నాన్ను చంపుతానని అమ్మ కొద్దిరోజులుగా బెదిరిస్తూనే ఉంది. అనుకున్నట్లుగా చెల్లితో కలిసి చంపేసిందని కార్తీక్ వాపోయారు.
సార్ డ్యూటీలో ఉన్నప్పుడే మేడమ్ గురించి చెప్పేవారు. మేడమ్ కు మానసికస్థితి బాగాలేదని..ఆమె ఆరోగ్యం కోసం లక్షలు ఖర్చు చేస్తున్నట్లు చెప్పేవారు. ఆమె ఎవరినీ ఇంటికి రానిచ్చేవారు కాదు. నేను సారు డెడ్ బాడీ చూసిన తర్వాత కరడు గట్టిన నేరస్థులు మాత్రమే ఇలా ఓ వ్యక్తిని చంపుతారు. చంపే ముందు ఆయన కంట్లో కారం చల్లారు. తర్వాత చేతులు, కాళ్ల కట్టి బీరే సీసా, చాకుతో పొడిచారు. ఊపిరి ఉందని తెలుసుకుని తలపై కొట్టినట్లు తెలుస్తోంది. మరణించే ముందు కనీసం 20 నిమిషాల పాటు పెనుగులాడినట్లు తెలుస్తోంది. ఆయన మరణించినట్లు ధ్రువీకరించిన తర్వాత అందరికీ మేడమ్ ఫోన్ చేసి చెప్పారని వీవీఐపీ సెక్యూరిటీ విభాగం ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
అయితే ఈ హత్యకు ఓం ప్రకాశ్ భార్య మానసిక స్థితి ఎంత కారణమూ..ఆస్తి గొడవలు కూడా అంతే కారణమని భావిస్తున్నామన్నారు. ఓం ప్రకాశ్ భార్య కుమార్తె దగ్గర కంటే కుమారుడు, చెల్లితో ఉండేందుకు ఇష్టపడేవారు. ఉత్తరకన్నడ జిల్లా దండేలి దగ్గర ఉన్న 17ఎకరాల భూమిని కుమారుడు, చెల్లికి రాసేందుకు సిద్ధమయ్యాడు. దీంతో భార్య, కుమార్తెలు ఓం ప్రకాశ్ తో నిత్యం గొడవ పడుతుండేవారు. చివరకు ప్రాణాలు తీసే స్థితికి చేరుకున్నారని అనుమానిస్తున్నారు. గొడవల విషయాన్ని పల్లవి పోలీసు అధికారులు గ్రూపుల్లోనూ పలుమార్లు పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ఓం ప్రకాశ్ దగ్గర అనుమతి లేని తొపాకులు, మత్తు పదార్థాలు ఉన్నాయి. వాటిని తీసుకువెళ్లండి. లేదంటే నన్ను చంపుతారు అంటూ గ్రూపులో మెసేజ్ పెడుతుండేవారని తెలుస్తోంది. ఆయనను అదుపు చేయకపోతే నేనే చంపుతాను. అందుకు బాధ్యులు మీరేనంటూ హెచ్చరిస్తుండేవారు. ఆదివారం సాయంత్రం హత్య తర్వాత రాక్షసుడిని చంపేశా..తీసుకెళ్లండంటూ గ్రూపులో పెట్టిన మెసేజ్ ఆమె మానసిక స్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందని ఓ పోలీస్ అధికారి తెలిపారు. మరోవైపు సోమవారం ఉదయం ఓం ప్రకాశ్ డెడ్ బాడీని పోస్ట్ మార్టం పూర్తి చేయగానే అంత్యక్రియలు జరిపించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe