Former Karnataka police chief dgp om Prakash found dead: ఇటీవల కాలంలో సమాజంలో భార్యలు రెచ్చిపోతున్నారు. భర్తలను టార్చర్ పెడుతున్నారు. ఒకప్పుడు భర్తలు భార్యల్ని వేధించేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. భార్యలు తమ భర్తలను టార్చర్ పెట్టడమే కాకుండా.. తమ వివాహేతర సంబంధాలకు అడ్డు వస్తే చంపేయడానికి కూడా అస్సలు వెనక్కు రావడం లేదు.
ఇప్పటికే ఎంతో మంది టెకీలు, ఉద్యోగులు భార్యల వేధింపులు భరించలేక వీడియోలు తీసుకుని ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో ప్రస్తుతం కర్ణాటకలోని బెంగళూరులో మరో సంచలనం చోటు చేసుకుంది. ఏకంగా మాజీ డీజీసీ తన నివాసంలో అత్యంత ఘోరంగా పదునైన ఆయుధాలతో దాడి చేసి చంపబడ్డాడు. ఈ ఘటన పోలీసు శాఖను షాకింగ్ కు గురిచేసేదిగా మారింది.
1981 బ్యాచ్ కు చెందిన ఓంప్రకాశ్ 2015లో కర్ణాటక రాష్ట్రానికి 38వ డీజీ అయ్యారు. ఆయన రిటైర్మెంట్ తర్వాత.. తన కుటుంబంతో కలిసి బెంగళూరులోని తన నివాసం హెచ్ఎస్ ఆర్ లేఅవుట్ లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఏమైందో కానీ.. ఆయన దారుణంగా చంపడ్డారని సాయంత్రం 4 నుంచి 4.30 ల ప్రాంతంలో పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది.
వెంటనే పోలీసులు అక్కడకు వెళ్లి చూడగా.. అప్పటికే పదునైన ఆయుధాలు,రక్తపు మడుగులో మాజీ డీజీపీ ఓంప్రకాష్ విగత జీవిగా పడి ఉన్నారు. ఆయన్ను వైద్యులు చూసిన తర్వాత చనిపోయాడని కన్పామ్ చేసుకుని, పోస్ట్ మార్టంకు తరలించారు. అయితే.. ఈ ఘటన తర్వాత పోలీసులు డీజీపీ భార్యను , ఆయన కూతుర్ని అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు ఓం ప్రకాష్ భార్య అంతకుముందు ఒక వాట్సప్ మెసేజ్ షేర్ చేసినట్లు తెలిసింది. తన భర్త ఇంట్లో తుపాకీ పట్టుకుని తిరుగుతున్నాడని.. తనను చంపాలనే ఉద్దేశంతో ఉన్నాడని అందులో ఓంప్రకాష్ భార్య పేర్కొన్నట్లు తెలుస్తొంది. దీంతో గొడవలు పడి, అతడ్ని చంపినట్లు కూడా ఆమె ఐపీఎస్ అధికారి భార్యతో వీడియో కాల్ మాట్లాడినట్లు సమాచారం. ఈ క్రమంలో పోలీసులు మాజీ డీజీపీ భార్య, కూతురును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter