)
Four years girl molested in Mumbai School: ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన, పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించిన కూడా కామాంధులు మారడం లేదు. అంతే కాకుండా.. పసిపాప నుంచి పండు ముసలి వరకు ఎవర్ని వదలడంలేదు. కొంత మంది మరీ దారుణంగా నోరులేని పశువులపై కూడా అత్యాచారాలకు పాల్పడుతున్నారు.
ఈ క్రమంలో బస్టాండ్ లు, మెట్రోలు, పని ప్రదేశాలు, స్కూళ్లు, ఆఫీసులు , చివరకు పోలీస్ స్టేషన్ లో కూడా మహిళలు వేధింపులకు గురౌతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ముంబైలో జరిగిన దారుణమైన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
ముంబైలో స్థానికంగా ఉన్న పాఠశాలలో నాలుగెళ్ల బాలిక అత్యాచారంకు గురైంది. బాలిక కడుపు నొప్పి అని ఇంటికి రావడంతో అమ్మమ్మ ఆరా తీసింది. అప్పుడు జరిగిన ఘటన వెల్లడించింది. కడుపు నొప్పిగా ఉందని, ప్రైవేటు భాగాల వద్ద ఇబ్బందిగా ఉందని యువతి తన అమ్మమ్మతో వాపోయింది.
ఈ క్రమంలో ఆస్పత్రికి తరలించి టెస్టులు చేయగా దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు స్కూల్ లో ఉన్న లేడీ టీచర్ ను అరెస్ట్ చేశారు. ఈ ఘటన ముంబైలో పెనుసంచలనంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook