What is GPS Spoofing Delays Delhi Flights: ఇప్పటివరకు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సైబర్ దాడులు ఎక్కువగా ఎదుర్కొన్నాం. ఆ ఘటనలకు సంబంధించిన వార్తలు విన్నాం. ప్రస్తుతం ఏకంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టంపై సైబర్ దాడి జరగడం ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టంలో సాంకేతిక లోపం ఏర్పడి దాదాపు 800 పైగా విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. శుక్రవారం సాయంత్రం నాటికి పరిస్థితులు సద్దుమణిగినా కానీ మన భారత కంట్రోల్ వ్యవస్థపై సైబర్ దాడి జరిగింది. ఇది ఆకాశంలో సిగ్నలింగ్ వ్యవస్థపై జరిగిన ఓ సైబర్ దాడి. దీన్నే జీపీఎస్ స్పూఫింగ్ అని పిలుస్తున్నారు.
ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టంపై ఈ ప్రభావం పడింది. తద్వార విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అందించే కమ్యూనికేషన్ వ్యవస్థపై దీని ప్రభావం పడుతుంది. ప్రతిరోజు కొన్ని వేల విమానాలు ఆటోమేటిక్గా నడుస్తాయి. అయితే ఈ ప్రక్రియలో సమస్యలు ఏర్పడినప్పుడు మ్యానువల్ గా పనులు చేయాల్సి ఉంటుంది. తద్వారా ఈ ప్రక్రియ కూడా నెమ్మదిస్తుంది. అందుకే విమానాలు ఆలస్యంగా నడిచాయి.
అయితే ఇటీవలి కాలంలో జీపీఎస్ స్పూఫింగ్ సంఘటనలు పెరుగుతూ వస్తున్నాయి. దీని ప్రభావమే ఢిల్లీ విమానాశ్రయం విమాన రాకపోకలపై పడింది. జీపీఎస్ స్పూఫింగ్ అనే సైబర్ దాడి విమానం లేదా పరికరాన్ని తప్పుదారి పట్టించడానికి ఇది ఒక నకిలీ సంకేతం అని చెప్పవచ్చు. అంటే నిర్దిష్ట లక్ష్యాన్ని చేరుకునే బదులుగా అది భిన్నమైన స్థానాన్ని ఎంచుకుంటుంది. జీపీఎస్ స్పూఫింగ్.. జీపీఎస్ జామింగ్ కంటే భిన్నమైంది. జామింగ్ సిగ్నల్స్ బ్లాక్ చేస్తుంది. కానీ జీపీఎస్ స్పూఫ్ విమానాన్ని తప్పుదారి పట్టిస్తుంది తప్పుడు సంకేతాలను ఇస్తుంది.
అంటే ఒక విమానం హైదరాబాద్ మీదుగా ప్రయాణం చేయాల్సి వస్తే దాని నావిగేషన్ సిస్టం తమిళనాడు వైపుగా చూపిస్తుంది. దాని స్థాన డేటా పూర్తిగా గందరగోళంగా ఉంటుంది. కచ్చితంగా కోల్పోతుంది. ఇప్పుడు ఢిల్లీ విమానాశ్రయంలో కూడా ఇదే జరిగింది. తద్వారా సమస్య మరింత తీవ్రతరంగా మారింది. ఇక డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ కూడా ఈ జీపీఎస్
స్పూఫింగ్ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. ఇక భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో 2023 నుంచి 2025 ఫిబ్రవరి వరకు దాదాపు 465 జీపీఎస్ స్పూఫింగ్ సంఘటనలు ఎదురయ్యాయి.
Read more: విమాన ప్రయాణీకులకు బిగ్ షాక్.. ఏటీసీ వ్యవస్థలో సాంకేతిక లోపం, 100 విమానాలు ఆలస్యం..!
Read more: పీఎం కిసాన్ లేటెస్ట్ అప్డేట్.. 21వ విడుత నిధులు ఎప్పుడంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









