Landslide hits army camp in sikkim 3 dead, 9 soldiers missing: భారీ వర్షాలకు ఈశాన్య రాష్ట్రాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. గత నాలుగు రోజులుగు ఎడతెరిపిలేకుండా కుండపోతగా వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఘోర ప్రమాదం సంభవించింది. భారీ వర్షాలకు.. ఉత్తర సిక్కింలోని ఛతేన్ అనే ప్రదేశంలో మిలిటరీ క్యాంప్పై మీద కొండ చరియలు విరిగిపడ్డాయి.
దీంతో అక్కడున్న ముగ్గురు భద్రత సిబ్బంది స్పాట్ లోనే చనిపోయారు. మరొ తొమ్మిది మంది గల్లంతయ్యినట్లు అధికారులు వెల్లడించారు. ఆర్మీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి.
ఒక్కసారిగా భారీ వరద నీరు, పెద్ద పెద్ద రాళ్లు పడటంతో జవాన్లు ఎక్కడికి వెళ్లలో పాలుపోక.. దుర్మరణం చెందినట్లు సమాచారం. ఈ క్రమంలో అధికారులు చనిపోయిన వారి డెడ్ బాడీలను ఆస్పత్రికి తరలించారు. అదే విధంగా మరో తొమ్మిది మంది కోసం గాలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ముఖ్యంగా.. ఈశాన్య రాష్ట్రాల్లో వర్షం చుక్కలు చూపిస్తుంది. సిక్కిం, అస్సాం, మణిపుర్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మిజోరాం, నాగాల్యాండ్, మేఘాలయలో గత నాలుగు రోజులుగా కుండపోతగా వాన కురుస్తున్నాయి. వర్ష బీభత్సనానికి కొండ చరియలు విరిగిపడుతున్నాయి.
ఇళ్లలోకి నీరు భారీగా వచ్చి చేరుతుంది. సామాన్య జన జీవనం అంతా ఒక్కసారిగా అస్తవ్యస్తంగా మారిపోయింది. మరోవైపు ఈశాన్య రాష్ట్రాంలో ఇప్పటి వరకు వరదల ధాటికి నలభై మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తొంది. మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఒక ప్రకటనలో హెచ్చరించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









