)
Patanjali Ayurveda: పతాంజలి బాబా రాందేవ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఆయుర్వేద విధానం.. ప్రజల ఆరోగ్యం పై ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుంది. 2006లో బాబా రాందేవ్ ఆచార్య బాలకృష్ణలు ఈ పతాంజలిని ప్రారంభించారు. అప్పటినుంచి ఇది ప్రజల ఆరోగ్యంపై కృషి చేస్తూ మంచి మన్ననలను కూడా పొందుతుంది. ఎక్కువ మంది ప్రపంచవ్యాప్తంగా యోగ పై తమ దృష్టిని మళ్ళించారు. ప్రధానంగా పతాంజలి ఆయుర్వేదాన్ని కూడా కాపాడింది. మన ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్చింది .
మొదట్లో 'దివ్య ఫార్మసీ' అనే పేరుతో ఈ పతాంజలి ఆయుర్వేదం ఔషధాలు విక్రయించారు. కానీ ఆ తర్వాత రాను రాను ఈ ఉత్పత్తులను ఆ మార్కెట్కు అనుగుణంగా ప్రజలకు తరాలకు తగ్గట్టుగా షాంపూ, సబ్బులు, టూత్ పేస్టులు వంటివి కూడా ఈ పతాంజలి బ్రాండ్ కిందకి వచ్చేసాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లో విపరీతంగా ఈ బ్రాండ్ కు సంబంధించిన వస్తువులు ప్రాచుర్యం పొందాయి. దిగ్గజ బ్రాండ్లలోనే పతాంజలి అంటే ఒక ప్రత్యేక బ్రాండ్ గా నిలిచిపోయింది.
పెద్ద కంపెనీలకు పోటీగా పతాంజలి ఉత్పత్తులు ప్రస్తుతం కొత్త ఆయుర్వేద విధానాన్ని కూడా లాంచ్ చేయాల్సి వచ్చింది. ఈ విధంగా పతాంజలి కేవలం ఉత్పత్తులను మాత్రమే కాదు ప్రజల జీవితంలో ఒక ప్రత్యేక ఆయుర్వేదాన్ని తిరిగి తీసుకువచ్చిందని చెప్పాలి. ఇంకా పతాంజలి ప్రజల అభిమానాన్ని ఎలా పొందింది అంటే బాబా రాందేవ్ వీడియోల ద్వారా అని చెప్పాలి. పతాంజలి ఫ్యాక్టరీకి తీసుకువెళ్లి తమ ఉత్పత్తులు ఎలా తయారవుతున్నాయో చూపించడం ద్వారా వారికి నమ్మకం మరింత పెరిగింది. గతంలో ఆయుర్వేదం అంటే కేవలం దాది, నోని ఔషధాలు మాత్రమే అనుకున్నారు. కానీ రాను రాను ప్రజల్లో పతాంజలి పై నమ్మకం పెరిగింది. దీంతో ఈ ఉత్పత్తుల వినియోగించడం కూడా ప్రారంభించారు. ఇవి శుద్ధమైనవి ఆయుర్వేద రీతిలో తయారవుతున్నాయని ప్రజలు అర్థం చేసుకున్నారు .
ఈ నేపథ్యంలో పతాంజలి కూడా మార్కెట్ విధానంలో విస్తృత మార్పులు చేసింది. మొదట్లో కేవలం కేవలం మాల్లో, సాధారణ స్టోర్ లో మాత్రమే విక్రయించేది. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా పతాంజలి స్టోర్లను ప్రారంభించే స్థాయికి ఎదిగింది. ఈ స్టోర్ లో వైద్యులు కూడా అందుబాటులో ఉంటారు. ఉచితంగా ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి వాటికి తగ్గట్టు మందులు కూడా అందజేస్తున్నారు. ఈ పతాంజలి దేశి ఉత్పత్తిలో రెడీ టు డ్రింక్స్ కూడా మార్కెట్లోకి వచ్చేసాయి. ముందుగా ఉసిరి, గిలోయి వంటి పదార్థాలు ముట్టుకోవాలంటే ప్రజలు భయపడేవారు. ఇప్పుడు నేరుగా వాటిని కొనడానికి చాలా ఆసక్తి చూపుతున్నారు.
పతాంజలి మరో అధ్యయనికి కూడా తెరతీసింది. మొదట్లో అశ్వగంధ, త్రిఫల కేవలం పొడి రూపంలో మాత్రమే దొరికేది. కానీ తాజాగా టాబ్లెట్ల రూపంలో కూడా మార్కెట్లో విడుదల చూసి ఒక సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఆయుర్వేదం పై నమ్మకం పెరిగింది. ఇలా ప్రజలు బాబా రాందేవ్ ఒక వల్ల యోగాతో పాటు ఈ ఆయుర్వేదాన్ని నమ్మడం కూడా ప్రారంభించారు. మనదేశంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా పతాంజలి ఉత్పత్తులపై నమ్మకం పెరిగింది. జూన్ 21న ఇంటర్నేషనల్ యోగ డేగ యునైటెడ్ నేషన్స్ కూడా ప్రకటించింది. యోగకు ఒక ప్రత్యేక గుర్తింపు కూడా తీసుకువచ్చింది పతాంజలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook