)
Missing Husband On Insta Reel: చాలామంది ఇంస్టాగ్రామ్ వేదికగా అనేక పోస్టులు పెడతారు. అలాగే రీల్స్ కూడా చేయడం చూస్తూ ఉంటాం. అయితే ఇవి మనకి ఎంతో ఎంటర్టైన్మెంట్ అందిస్తాయి. అయితే ఒక్కోసారి అవి షాకింగ్ నిజాలను కూడా బయటపెడతాయి. ఉత్తర ప్రదేశ్ లోని హర్దోవీలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ఏడేళ్ల క్రితం నుంచి కనిపించకుండా పోయిన భర్త జాడను వెతికి పెట్టింది. పోలీసుల ప్రకారం హర్దోవీకు చెందిన జితేంద్ర 2017లో షీలు అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఆమె గర్భవతి ఆయన వెంటనే ఏడాదికే అతను అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. దీంతో ఆమె భర్త జాడ తెలియక నరకయాతనపడి ఎన్నో అవమానాలు కూడా భరించింది. అంతేకాదు సదరు భర్త తల్లిదండ్రులు షీలుతోపాటు తన తల్లిదండ్రులపై తనే భర్తను హత్య చేసి ఉండవచ్చని కేసు పెట్టారు. అప్పటినుంచి షీలు తన తల్లి గారి ఇంట్లోనే ఉంది.
అయితే, ఏడేళ్ల తర్వాత ఇంస్టాగ్రామ్ చూస్తున్నప్పుడు ఓ రీల్ అకస్మాత్తుగా ఆమె కంట్లో పడింది. అది ఎవరో కారు తన భర్త వేరే మహిళతో కలిసి ఉన్న రీల్ అది. తన భర్త తనను మోసం చేశారని అప్పుడు గ్రహించిన సదరు మహిళా వెంటనే పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేసింది. అతడు తనను మోసం చేశారని లుధియానాలో ఉన్న మరో మహిళను వివాహం చేసుకున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సదరు భర్తను అదుపులోకి తీసుకున్నారు.
కేసు నమోదు చేసుకొని ఆరా తీసి అతను ఏడేళ్లుగా లుధియానాలోనే సదరు మహిళతోనే ఉంటున్నారని తెలిసింది. భర్త జితేంద్రపై కేసు నమోదు చేసిన పోలీసులు అతని విచారిస్తున్నారు. అయితే షీలును జితేంద్ర పెళ్లి అయినప్పటి నుంచి వేధింపులు చేశాడు. 2017 లో వీరి వివాహం జరిగింది. అప్పటి నుంచి వరకట్నం కోసం వేధింపులకు పాల్పడ్డారు ఆమెపై అనేక డిమాండ్లు చేసి ఇంట్లో నుంచి గెంటేశాడు అని అప్పట్లోనే ఆమె ఫిర్యాదు చేసింది. ఈ కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే జితేంద్ర కనిపించకుండా పోయాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.