
Heavy Rains Alert: నైరుతి రుతు పవనాలు బలహీనమైన తరుణంలో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో దక్షిణాది ప్రాంతంలో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
బంగాళాఖాతంలో తాజాగా మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఫలితంగా దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. క్రమంగా ఈ వర్షాలు ఉత్తర తమిళనాడు, దక్షిణాంధ్ర జిల్లాలకు విస్తరించనున్నాయని ఐఎండీ తెలిపింది. నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకినప్పటి నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఆ తరువాత రుతు పవనాలు మందగించడంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు మళ్లీ అల్పపీడనం ఏర్పడటంతో రానున్న వారం రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. రుతు పవనాలు మందగించిన సమయంలో మాత్రం ఎండలు తీవ్రమై భరించలేని ఉక్కపోత ఎదురైంది. జనం ఉక్కిరిబిక్కిరయ్యారు.
ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా తమిళనాడులోని ఈ జిల్లాలకు భారీ వర్షసూచన జారీ అయింది. కడలూరు, విల్లుపురం, తిరుపత్తూరు, వేలూరు, రాణిపేట, అరియలూరు, మైలాడుతురై, కృష్ణగిరి, ధర్మపురి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఇక రేపు అంటే బుధవారం నాడు తంజావూరు, నాగపట్నం, తిరుచురాపల్లి, కడలూరు, పుదుక్కోటి, పెరంబదూరు, విల్లుపురం, తిరువణ్ణామలై, ధర్మపురి, కృష్ణగిరి, నీలగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
మా సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook