)
Railway Reservation: రైల్వే ప్రయాణికులకు సర్వీసుల్ని మరింత సులభతరం చేసేలా రైల్వేశాఖ నూతన సంస్కరణలు తీసుకొస్తోంది. ఇప్పటికే అధునాతన సౌకర్యాలతో వందేభారత్ వంటి కొత్త తరహా రైళ్లను ప్రవేశపెట్టింది రైల్వే శాఖ. రీసెంట్ గా తత్కాల్ టికెట్లకు ‘ఆధార్ అథంటికేషన్’ అమలు చేయనున్నట్లు ప్రకటించింది. తాజాగా టికెట్ రిజర్వేషన్ విధానంలోనూ కీలక మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రైలు బయల్దేరడానికి 8 గంటల ముందే ప్రయాణికుల చార్ట్ను సిద్ధం చేయాలని రైల్వేబోర్డు ప్రతిపాదించింది. రిజర్వేషన్ ఖరారు అయ్యిందో లేదో 8 గంటల ముందే తెలిసిపోతుంది. దీన్ని బట్టి వేరే ప్రత్నామ్నాయ ప్రయాణ సాధనాలు ఎంచుకోవచ్చు. ముఖ్యంగా వెయిటింగ్ లిస్టు ప్రయాణిలకు లబ్ధి చేకూరనుంది. టికెట్ బుకింగ్ వ్యవస్థలో చేపట్టాల్సిన సంస్కరణపై రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇటీవల సమీక్ష నిర్వహించారు. టికెటింగ్ వ్యవస్థ పూర్తి పారదర్శకంగా, ప్రభావవంతంగా, ప్రయాణికులకు సౌలభ్యంగా ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగానే రిజర్వేషన్ చార్ట్ను ప్రయాణానికి 8 గంటల ముందు ప్రకటించాలని నిర్ణయించారు.
ఈ రిజర్వేషన్ విధానాన్ని దశల వారీగా అమల్లోకి తీసుకురానున్నారు. టికెట్ స్టేటస్పై ముందుగా అప్డేట్ ఇరత ప్రాంతాల నుంచి ఆయా రైల్వే స్టేషన్లకు చేరుకొనే వారికి ఇది ఉపయోగపడుతుంది. ఒకవేళ టికెట్ కన్ఫర్మ్ కాకపోతే వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొనేందుకూ మరింత ఎక్కువ సమయం అందుతుంది. ముందస్తు చార్టుల తయారీతో పాటు 2025 డిసెంబర్ నాటికి అధునాతన ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ ను తీసుకొచ్చే దిశగా రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. ఈ ప్రాజెక్టును సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ద్వారా అమలు చేయనుంది. అయితే, ఈ ప్రతిపాదనతో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఏకీభవించారని.. ఎలాంటి అంతరాయం కలగకుండా దశలవారీగా దీన్ని అమలు చేయాలని ఆదేశించినట్లు రైల్వే బోర్డు తెలిపింది.
కొత్త ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ అమలులోకి వస్తే.. ఒక్క నిమిషంలోనే 1.5 లక్షలకు పైగా టికెట్ బుకింగ్లను చేసే సామర్థ్యం అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ఇది నిమిషానికి 32వేల టికెట్లుగా ఉండగా.. కొత్త వ్యవస్థలో బుకింగ్ సామర్థ్యం దాదాపు ఐదు రెట్లు అధికంగా పెరుగుతుంది. అలాగే, టికెట్ ఎంక్వైరీ వ్యవస్థ మరింతగా మెరుగుపడనుంది. ఎంక్వైరీ సామర్థ్యం నిమిషానికి 4 లక్షల నుంచి 40లక్షలకు పైగా పెరగనుండటంతో లక్షలాది మంది ప్రయాణీకులకు రియల్-టైమ్ బుకింగ్ సమాచారం పొందే అవకాశం కలుగుతుంది. ఇదిలా ఉండగా.. జులై 1 నుంచి ఆధార్ అథంటికేషన్ పూర్తి చేసుకున్న వారికే రైల్వే తత్కాల్ టికెట్లు బుక్ చేసుకొనే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. టికెట్ల బుకింగ్లో అక్రమాలు అరికట్టడమే లక్ష్యంగా ఈ నిబంధనను రైల్వేశాఖ తీసుకొచ్చింది. అలాగే, జులై నెలాఖరు నుంచి టికెట్ బుకింగ్ సమయంలో ఆధార్ ఓటీపీని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.