భారత్‌లో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. గత పది రోజులుగా కరోనా కేసులు తగ్గుతుండగా, తాజాగా 2 లక్షల దిగువకు పాజిటివ్ కేసులు దిగిరావడం భారీగా ఊరట కలిగిస్తోంది. గడిచిన 24 గంటలలో కోవిడ్19 మరణాలు సైతం నిన్నటితో పోల్చితే తగ్గాయి. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ ఇన్‌ఫెక్సన్లు సమస్యగా మారుతుండగా ఇటీవల ఎల్లో ఫంగస్ కేసులు సైతం గుర్తించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,96,427 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి దేశంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,69,48,874 (2 కోట్ల 69 లక్షల 48 వేల 8 వందల 74)కు చేరింది. అదే సమయంలో దేశ వ్యాప్తంగా మరో 3,511 మందిని కోవిడ్19(COVID-19) మహమ్మారి బలిగొంది. దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 3,07,231కి చేరుకున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ విడుదల చేసింది.


Also Read: Fertility Myths: సంతానలేమిపై మగవారిలో 5 ముఖ్యమైన సందేహాలు, వాటి సమాధానాలు


దేశ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజు 3,26,850 (3 లక్షల 26 వేల 8 వందల 50) మంది కోవిడ్-19 మహమ్మారిని జయించి ఆరోగ్యంగా డిశ్ఛార్జ్ అయ్యారు. భారత్‌లో ఇప్పటివరకూ  2,40,54,861 (2 కోట్ల 40 లక్షల 54 వేల 861) మంది కరోనా వైరస్(CoronaVirus)ను జయించారు. దేశంలో ప్రస్తుతం 25,86,782 (25 లక్షల 86 వేల 782 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. 


మే 24న దేశ వ్యాప్తంగా 20,58,112 కరోనా శాంపిల్స్ పరీక్షించారు. 33,25,94,176 (33 కోట్ల 25 లక్షల 94 వేల 176) మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. తాజాగా పాజిటివ్ కేసుల కన్నా డిశ్ఛార్జ్ కేసులు అధికంగా నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకూ 19 కోట్ల 85 లక్షల 38 వేల 999 మందికి టీకా ప్రక్రియ పూర్తయింది.


Also Read: SBI Mobile Number Change: బ్యాంకుకు వెళ్లకుండా ఎస్‌బీఐ మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోండి 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook