)
Lucknow to delhi indigo flight narrowly escaped from major accident: ఇటీవల దేశంలో విమాన ప్రమాద ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. అంతే కాకుండా అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం ఏ మూహుర్తంలో జరిగిందో కానీ.. అప్పటి నుంచి తరచుగా మనదేశంలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట విమాన ప్రమాదాలు లేదా ఫ్లైట్లలో సాంకేతిక సమస్యల ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి.
ఈ క్రమంలో ఎయిర్ సిబ్బంది ఎంతగా అప్రమత్తంగా ఉన్నామన్న కూడా విమానంలో సాంకేతిక సమస్యల ఘటనలు మాత్రం వార్తలలో ఉంటున్నాయి. తాజాగా.. లక్నో-ఢిల్లీ ఇండిగో విమానంను పైలేట్ టేకాఫ్ చేసేందుకు ప్రయత్నించాడు.
కానీ ఏదో సాంకేతిక సమస్య ఏర్పడిందని అతను గుర్తించాడు. సెకన్ల వ్యవధిలోనే అతి కష్టం మీద విమానంను రన్ వే మీద ల్యాండ్ చేశాడు. దీంతో పెద్ద ప్రమాదం నుంచి ఇండిగో విమానంలో ఉన్న వారు బైటపడినట్లైంది.
విమానంలో ఎంపీ డింపుల్ యాదవ్ తో పాటు మరో 151 మంది ప్రయాణికులు కూడా ఉన్నారు. ఒక వేళ పైలేట్ అలర్ట్ కాకుంటే.. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తరహాలో అయ్యే ప్రమాదం ఉండేదని అక్కడి వారు అంటున్నారు. పైలెట్ అప్రమత్తత, చాకచక్యత వల్ల ఎలాంటి అందరు సేఫ్ గా బైటపడ్డారు. ఈ నేపథ్యంలో విమానంలో ఉన్న వారంత తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook