
What Is Indus Water Treaty Agreement: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పహల్గాం దాడి కారణంగా భారత్ పాకిస్తాన్తో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకుంటుంది. అటారీ బార్డర్ కూడా మూసివేయనుంది. ఇక పాకిస్తాన్తో ఉన్న సింధు నది జలాల ఒప్పందంపై కూడా కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. కొన్ని ఏళ్ల క్రితం చేసుకున్న సింధూ నది జలాల ఒప్పందం కూడా సస్పెండ్ చేసింది. ఈ అగ్రిమెంటు నిలిపివేయడం వల్ల చిన్న సింధు నది, జీలం, బియాజ్, సట్లేజ్ నది నీళ్లు పాకిస్తాన్ కి నిలిచిపోతాయి. ఈ నేపథ్యంలో కొన్ని మిలియన్ల మంది ప్రజలు పై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ నదులు అక్కడి ప్రజలకు ప్రధాన వనరులు. వ్యవసాయం ఇతర అవసరాలను తీరుస్తాయి.
సింధూ నది అగ్రిమెంట్ ఏమిటి ?
సింధూ నది అగ్రిమెంటు 1960 సెప్టెంబర్ 19వ తేదీ ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగింది. వరల్డ్ బ్యాంక్ సమక్షంలో ఇరుదేశాలు సంతకం చేశాయి. అయితే ఇండియా పాకిస్తాన్ మధ్య 1965, 1971, 1999 మధ్య యుద్ధం వచ్చినా కానీ ఈ నీటి జలాల పంపకంలో ఎలాంటి నిలుపుదల చేయలేదు. కానీ, తాజాగా పహల్గాం దాడి తర్వాత ఈ నీటిని నిలిపివేసింది భారత్. ఈ సింధు నది జలాల అగ్రిమెంటు కరాచీలో భారత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ, అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు మార్షల్ అయుభ్ ఖాన్ మధ్యలో జరిగింది.
ఈ అగ్రిమెంటు ప్రకారం తూర్పు దిశగా వెళ్లే బియాస్, రవి, సట్లేజ్ ఇండియాలో ఉండే ఈ ఉపనదులన్నీ ఏడాదికి 41 బిలియన్ మెట్రిక్ క్యూబ్ ఇండియా ఉపయోగిస్తుంది. అయితే పశ్చిమ దిశగా వెళ్లే నదులు అయిన సింధు, చీనబ్, జీలం 99 బిలియన్ల మెట్రిక్ క్యూబ్స్ పాకిస్తాన్ వినియోగించుకుంటుంది. అంటే 30% నీటిని ఇండియా వినియోగిస్తే సింధూ నది వ్యవస్థలో పాకిస్తాన్ మాత్రం 70% నీటిని వినియోగిస్తుంది.జీల, చీనబ్ ఉపనదులపై భారత్ కిషన్ గంగా ప్రాజెక్టును కూడా నిర్మిస్తోంది.
భారతదేశం ప్రవాహాన్ని నిలిపివేయడం వల్ల పాకిస్తాన్ విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది. నీటి ప్రవాహం తగ్గడం వల్ల పంట వైఫల్యాలు, దిగుబడి తగ్గడం, ఆహార అభద్రత ఏర్పడవచ్చు. ముఖ్యంగా గోధుమ, వరి, పత్తి వంటి పంటలు పండవు. దీంతో ఆహార కొరత ఏర్పడుతుంది.
2019 పూల్వామా అటాక్ జరిగినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నీళ్లు, రక్తం కలిసి ప్రవహించలేదు అని చెప్పాడు. ప్రస్తుతం మంగళవారం పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రమూక టీఆర్ఎఫ్కు లష్కరే తోయిబాకు సంబంధం ఉందనే ఆరోపణల నేపథ్యంలో ఈ నది జలాల ఒప్పందంతో పాటు పాకిస్తానీయులకు వీసా కూడా నిలుపుదల చేశారు. పహల్గాం ఉగ్రదాడిలో 27 మంది టూరిస్టులు చనిపోయారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe