)
IRCTC New Rules Update: ఐఆర్సీటీసీ ఇండియన్ రైల్వే టికెట్ బుకింగ్ యాప్ ద్వారా ప్రతిరోజు కొన్ని వేల మంది రైల్వే టికెట్ బుక్ చేసుకుంటారు. అయితే టికెట్ బుకింగ్ వ్యవస్థలో కొత్త మార్పులు వచ్చాయి. దాన్ని ముందుగానే మీరు గ్రహించాలి. లేకపోతే టికెట్ బుకింగ్ చేసుకునే సమయంలో ఇబ్బంది పడతారు. ఇది మాత్రమే కాకుండా కొన్ని ప్రైవేటు యాప్స్ ద్వారా కూడా మీరు సులభంగా రైల్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. భారతదేశంలో రైలు ప్రయాణం కొన్ని లక్షల మంది ప్రతిరోజూ చేస్తూ ఉంటారు. ఐఆర్సీటీసీ ద్వారా రైలు బుక్ చేసుకునే సదుపాయం కూడా ఉంది.
ఇటీవల జరిగిన తాజా మార్పులు గుర్తించుకోండి. ఐఆర్సీటీసీ ద్వారా రైల్ టికెట్ బుక్ చేయాలంటే కొన్ని మార్పులు చేశారు. ఇది ఐఆర్సీటీసీతో పాటు రైల్ ఆన్ యాప్కు కూడా వర్తిస్తుంది. ఈ మార్పులు ముందుగానే గుర్తిస్తే త్వరగా మీ టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.
ఐఆర్సీటీసీ ఖాతా ముందుగా క్రియేట్ చేసుకుని మీరు ఆధార్ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీరు సులభంగా రైల్వే టికెట్ బుక్ చేసుకుంటారు. ఎందుకంటే మొదటి 10 నిమిషాలు ఆధార్ అథాంటికేషన్ ఉన్న యూజర్లు మాత్రమే రైల్ టికెట్ బుక్ చేసుకునే సదుపాయం ఉంది. ఏజెంట్లు బుక్ చేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకువచ్చింది. అయితే ఉదయం 8 గంటల నుంచి పది గంటల వరకు ఆధార్ అథాంటికేషన్ ఉన్న యూజర్లు మాత్రమే రైల్ టికెట్ బుక్ చేసుకోగలరు.
మీ ఆధార్ ఐఆర్సీటీసీతో లింక్ చేయాలంటే ముందుగా ఐఆర్సీటీసీ యాప్ లేదా వెబ్సైట్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి. అక్కడ మీ యూజర్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చ అకౌంట్ నమోదు చేసి ప్రొఫైల్ లోకి వెళ్ళండి. కేవైసీ ఎంచుకొని 12 అంకెల ఆధార్ నంబర్ నెంబర్తో అథెండికేషన్ చేసుకోండి. ఓటీపీ నమోదు చేసి ఐఆర్సీటీసీ ఖాతాకు ఆధార్ లింక్ అయిపోతుంది. అయితే మీరు రైల్వే స్టేషన్ కి వెళ్తే అక్కడ టికెట్ బుకింగ్ లో ఎలాంటి మార్పులు లేవు. ఈ ఐఆర్సీటీసీ ఆధార్ లింకు మాత్రం 2025 అక్టోబర్ 28 నుంచి అమల్లోకి వచ్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.