)
Jammu Kashmir Flash Floods: జమ్ము కశ్మీర్ను వరదలు ముంచెత్తాయి. దోడా, జమ్మూ, కథువా, కిష్త్వార్, సాంబా, ఉదంపూర్ జిల్లాల్లో భారీ వర్షాలకు తావి నది ఉప్పొంగింది. దీంతో ఆయా ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అటు జమ్ముకశ్మీర్ జాతీయ రహదారిపై అనేక చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. రాళ్లు రోడ్లపై జారిపడటంతో NH-44 అంతటా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాతావరణం మెరుగుపడి రోడ్డు స్పష్టంగా కనిపించే వరకు ప్రజలు నేషనల్ హైవే NH-44పై ప్రయాణించవద్దని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితిలో 112కు డయల్ చేయాలని అధికారులు తెలిపారు.
జమ్మూ కశ్మీర్ మరో 36 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మొత్తంగా వరద ప్రవాహాంతో నదీ పరివాహాక ప్రాంతాల్లోని ఇళ్లు పేక మేడల్లో కూలిపోయాయి. మరికొన్ని ఇళ్లు పగుళ్లు ఏర్పడ్డాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
మరోవైపు జమ్మూ కశ్మీర్ తో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల ఫ్లాష్ ఫ్లడ్స్ తో వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా హిమాయల రాష్ట్రాలను వరదలు వదలడం లేదు. వరదలతో ఆయా రాష్ట్రాల్లో జన జీవనం తో పాటు పర్యాటక రంగం కుదేలైంది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ లోని కులు, మనాలీ, సిమ్లా ప్రాంతాలు వరదలతో అల్లాడుతున్నాయి. అటు ఉత్తరాఖండ్ లోని ఛార్ ధామ్ యాత్రకు తీవ్ర అడ్డంకులు ఏర్పడటంతో తాత్కాలికంగా యాత్ర నిలిపివేసినట్టు తెలిసింది.అటు అరుణాల్ ప్రదేశ్ లో కూడా భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడ్డయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.