)
JEE Advanced 2025: జేఈఈ మెయిన్ సెషన్ 1, 2 పరీక్షల ఫలితాలతో పాటు తుది ర్యాంకులు వచ్చేశాయి. దేశవ్యాప్తంగా 2 లక్షల 50 వేల 236 మంది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు. అడ్వాన్స్డ్ పరీక్షలో ర్యాంకుని బట్టి ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశం లభిస్తుంది. అడ్వాన్స్డ్ పరీక్షకు ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎలా దరఖాస్తు చేసుకోవాలనే వివరాలు తెలుసుకుందాం.
దేశవ్యాప్తంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జనవరి, ఏప్రిల్ నెలల్లో రెండు సెషన్లలో నిర్వహించిన జేఈఈ మెయిన్ పరీక్షలకు 15.39 లక్షల మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకోగా 14.75 లక్షల మంది హాజరయ్యారు. వీరిలో ఎన్టీఏ ప్రకటించిన కటాఫ్ పర్సంటైల్ ఆధారంగా 2.50 లక్షల మంది అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు. దేశవ్యాప్తంగా మే 18వ తేదీన ఈ పరీక్ష ఆన్లైన్ విధానంలో జరగనుంది. ఆ రోజు రెండు సెషన్లలో రెండు పేపర్లలో ఈ పరీక్ష ఉంటుంది. మే 18వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్ ఉంటే మద్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండవ సెషన్ ఉంటుంది. రెండు సెషన్లు తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు జూన్ 2న వెల్లడవుతాయి.
ప్రస్తుతం జేఈఈ రెండు సెషన్ల తరువాత అర్హత సాధించిన 2.50 లక్షల మంది దేశంలోని ఎన్ఐటీ, త్రిపుల్ ఐటీల్లో సీట్లు పొందుతారు. ఐఐటీల్లో అడ్మిషన్ పొందాలంటే మాత్రం అడ్వాన్స్డ్ పరీక్షలో ర్యాంకు సాధించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 23 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 2వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సమయం ఉంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, అమ్మాయిలకు ఫీజు 1600 రూపాయలు కాగా, ఇతరులకు 3200 రూపాయలు చెల్లించాలి. మే 11వ తేదీన జేఈఈ అడ్వాన్స్డ్ అడ్మిట్ కార్డులు విడుదలవుతాయి.
దేశవ్యాప్తంగా 23 ఐఐటీల్లో 17,695 బీటెక్, బ్యాచెలర్ ఆఫ్ సైన్స్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. బీఆర్క్ విద్యార్ధులు మాత్రం ప్రత్యేకంగా ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూట్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి