JEE Advanced 2025: దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ పరీక్షల్లో రెండు దశలు ఉంటాయి. అవి మెయిన్, అడ్వాన్స్డ్. ఇందులో మెయిన్ పరీక్షల మొదటి సెషన్ జనవరిలో ముగియగా రెండవ సెషన్ పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి ప్రారంభం కానున్నాయి. వీటిలో అర్హత సాధిస్తేనే అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హులవుతారు.
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు మే నెలలో జరగనున్నాయి. తెలంగాణలో మొత్తం 13 పరీక్ష కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 23 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ పరీక్ష మే 18వ తేదీన రెండు సెషన్లలో జరగనుంది. మే 18 ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్ అయితే మద్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండవ సెషన్ ఉంటుంది. రెండు సెషన్లకు హాజరుకావల్సి ఉంటుంది. మెయిన్స్ పరీక్షల్లో మెరిట్ ఆధారంగా 2.5 లక్షల మంది అడ్వాన్స్డ్ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు వీలుంటుంది.
జేఈఈ అడ్వాన్స్డ్ ముఖ్యమైన తేదీలు
ఏప్రిల్ 23 అప్లికేషన్ల ప్రక్రియ లేదా రిజిస్ట్రేషన్ ప్రారంభం
మే 2 అప్లికేషన్ చివరి తేదీ
మే 5 ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ
మే 1 అడ్మిట్ కార్డులు విడుదల
మే 18 జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష
మే 22 రెస్పాన్స్ షీట్స్ విడుదల
మే 26 ప్రైమరీ కీ విడుదల
జూన్ 2 ఫలితాలు విడుదల
Also read: Ramadan 2025 Wishes: అందరికీ ఈద్ ముబారక్, మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు ఇలా చెప్పండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









