Ex DGP OM Prakash Murder Case: కళ్లలో కారం చల్లి.. గాజు సీసాతో 16 సార్లు పొడిచి.. మాజీ డీజీపీ హత్యకేసులో షాకింగ్ నిజాలు..

Karnataka dgp om prakash murder case: కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాశ్ హత్యకేసులో దిమ్మతిరిగే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ డీజీపీ సతీమణి, ఆయన కూతురు, కోడలు ఈ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని కూడా పోలీసులు పలు విషయాలు బైటపెట్టారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 21, 2025, 12:45 PM IST
  • మాజీ డీజీపీ ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
  • భార్యే విలన్ అంటూ ప్రాథమికంగా తెల్చిన పోలీసులు..
Ex DGP OM Prakash Murder Case: కళ్లలో కారం చల్లి.. గాజు సీసాతో 16 సార్లు పొడిచి.. మాజీ డీజీపీ హత్యకేసులో షాకింగ్ నిజాలు..

Ex dgp om prakash murder case latest news: కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాశ్ హత్యకు గురికావడం ప్రస్తుతం దేశంలో సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఇప్పటికే దీనిపై పోలీసులు సీరియస్ గా విచారణ ప్రారంభించారు.  బెంగళూరులోని తన నివాసంలో ఓంప్రకాశ్ హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఉంటున్నారు. ఆయన నిన్న (ఆదివారం)  సాయత్రం 4 గంటల తర్వాత రక్తపు మడుగులో ఉన్నారని ఆయన భార్య పల్లవి పోలీసులకు సమాచారం ఇచ్చింది. అప్పటికే పల్లవి ఐపీఎస్ అధికారుల గ్రూప్ లో తన భర్తను చంపినట్లు కూడా మెస్సెజ్ చేసి, వీడియో కాల్ చేసింది.

ఈ క్రమంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో ఉన్న మాజీ డీజీపీని గుర్తించారు. అప్పటికే ఆయన విగత జీవిగా మారిపోయారు. వైద్యులు వచ్చి చూసి.. ఆయన ప్రాణాలతో లేరని వెల్లడించారు. దీంతో పోలీసులు బాడీనీ పోస్ట్ మార్టంకు తరలించారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనలో మాజీ డీజీపీ కొడుకు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో మాజీ డీజీపీకి ఆయన కుటుంబ సభ్యులకు కొన్నిరోజులుగా ఆస్తి వివాదాలు ఉన్నట్లు బైటపడింది.

ఈ నేపథ్యంలో భార్య పల్లవి, కూతుర్లు కలిసి ఇప్పటికే అనేక సందర్భాలలో ఓంప్రకాశ్ తో గొడవలకు దిగారంట. అంతేకాకుండా.. తన యావదాస్తిని తన బంధువుల పేరిట రాస్తానని మాజీ డీజీపీ భార్యను వేధించేవాడంట. అంతేకాకుండా.. కొడుతు దాడులు కూడా చేసేవాడంట. దీంతో అప్పటికే ఆయన భార్యపల్లవి.. స్కీజో ఫీనియాతో బాధపడుతుంది.

ఈ ఒత్తిడిలో.. భర్తపై ఆదివారం నాడు.. కారం పౌడర్ కళ్లలో చల్లి.. పదునైన సీసాను పగల కొట్టి దానితో దాదాపు.. 16 సార్లు కసితీరా పొడిచినట్లు విషయం బైటపడింది. భర్తను హత్య చేసిన తర్వాత కూడా పల్లవి ఒక ఐపీఎస్ భార్యకు వీడియో కాల్ చేసి మరీ చూపించిందంట. 

Read more: Karnataka Former DGP Murder: రక్తపు మడుగులో మాజీ డీజీపీ.. కత్తులతో పొడిచి చంపిన భార్య..?.. సంచలనంగా మారిన ఘటన..

 దీంతో పోలీసులు ఆ ప్రదేశంలో ఉన్న కారం పొడి మొదలైనవి, పదునైన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.  ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. మొత్తంగా ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News