)
Karnataka woman brutally Kills her husband for govt compensation: ఇటీవల భార్యభర్తలకు సంబంధించిన అనేక దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని చోట్ల భర్తలు తమ భార్యల్ని చంపుతుంటే.. మరికొన్ని చోట్ల వివాహేతర సంబంధాల్లో పడి భార్యలు తమ భర్తల్ని లేపేస్తున్నారు. అయితే.. కొన్నిసార్లు ప్రాపర్టీల కోసం కూడా ఒకరిపై మరోకరు స్కెచ్ లు వేసుకుని మరీ హత్యలకు దిగుతున్నారు. మొత్తంగా భార్యభర్తల మర్డర్లకు చెందిన క్రైమ్ స్టోరీలు ఇటీవల ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. ప్రస్తుతం కర్ణాటకలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
కర్ణాటకలోని హుణసూరు తాలూకా పరిధిలోని చిక్కహెజ్జూరు గ్రామానికి చెందిన వెంకటస్వామి (45), సల్లాపురి దంపతులు. వీరు తోటల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వీరి గ్రామంలో పులి సంచరిస్తున్నట్లు పుకార్లు వ్యాపించాయి. అయితే.. ప్రభుత్వం పులి దాడిలో చనిపోయిన వారికి ప్రభుత్వం రూ.15 లక్షలు పరిహారంగా ఇస్తుందని అక్కడి వారు మాట్లాడుకునే క్రమంలో మహిళకు తెలిసింది.
దీంతో తన భర్తను లేపేస్తే.. ప్రభుత్వం ఇచ్చే పరిహారంతో ఏంచక్కా హయిగా ఉండొచ్చని ఘోరమైన ప్లాన్ వేసింది. తన భర్త నిద్రలో ఉండగా బండరాళ్లతో, సుత్తెతో కొట్టి చంపింది. అంతేకాకుండా పెంటకుప్పల కింద శవాన్ని పెట్టింది. తన భర్త కన్పించడంలేదని డ్రామాలు ఆడింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ఆతర్వాత పోలీసులు ఆ ప్రదేశంలో పులి జాడల్ని వెతకగా కన్పించలేదు. కానీ మహిళ ప్రవర్తన మాత్రం అనుమానస్పదంగా ఉండటంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు.
ఈ క్రమంలో ఇంటి వెనుక ఉన్న పేడకుప్పలో వెంకటస్వామి మృతదేహాన్ని గుర్తించారు. ప్రభుత్వం ఇచ్చే పరిహరం కోసం తన భర్తను లేపేసినట్లు మహిళ అంగీకరించింది. ఈ ఘటనపై హుణసూరు గ్రామీణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook