Pahalgam Terror Attack LIVE: పాక్‌ను చావు దెబ్బకొట్టిన మోదీ.. అంతర్జాతీయంగా అడుక్కోవాల్సిందేనా..

Jammu Kashmir Terrorist Attack Live Updates: జమ్ము కశ్మీర్‌లో అనంత్ నాగ్ జిల్లా పహల్ గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పుకు తెగబడ్డారు. ఈ ఘటనలో 27 మంది మరణించగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి లైవ్‌ అప్‌డేట్స్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  

Written by - Ashok Krindinti | Last Updated : Apr 24, 2025, 05:18 PM IST
Pahalgam Terror Attack LIVE: పాక్‌ను చావు దెబ్బకొట్టిన మోదీ.. అంతర్జాతీయంగా అడుక్కోవాల్సిందేనా..
Live Blog

Jammu Kashmir Terrorist Attack Live Updates: జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అనంత్ నాగ్ జిల్లా పహల్ గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయగా.. ఇప్పటివరకు 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. హిందువులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడినట్లు సమాచారం. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో బైసరన్‌ ప్రాంతంలో తీవ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఆ ప్రాంతంలో దాదాపు 40 మంది పర్యాటకులు ఉండగా.. అటవీ ప్రాంతం నుంచి చొచ్చుకుని వచ్చిన ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఊహించని రీతిలో కాల్పులు జరపడంతో కొంతమంది అక్కడిక్కడే కుప్పకూలి మరణించారు. అనేక మంది తీవ్ర గాయాలకు గురికాగా.. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమ వారిని రక్షించాలంటూ బాధితులు చేస్తున్న వీడియోలు కంటతడి పెట్టిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి లైవ్‌ అప్‌డేట్స్‌ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
 

24 April, 2025

  • 17:17 PM

    Pahalgam Terror Attack Latest Updates: పహల్గామ్‌పై ఉగ్రవాదుల దాడి అనంతరం కరాచీ కేంద్రంగా నడిచే స్టాక్ ఎక్స్చేంజ్ భారీ నష్టాలను నమోదు చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 15:58 PM

    Pahalgam Terror Attack Latest Updates: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత అమెరికా కీలక హెచ్చరిక జారీ చేసింది. అమెరికన్లు జమ్మూ కాశ్మీర్‌కు, భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దుకు 10 కిలోమీటర్ల పరిధిలో ప్రయాణించవద్దని సూచించింది. 

  • 14:49 PM

  • 14:46 PM
  • 13:35 PM

    Pahalgam Terror Attack Latest Updates: పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) తీవ్రంగా ఖండించింది. పిరికిపంద చర్యగా అభివర్ణించింది. అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేసింది.  మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢమైన, ఐక్య వైఖరిని అవలంబించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. దాడిలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. త్వరగా న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరింది.

  • 13:13 PM

    Pahalgam Terror Attack Latest Updates: పహల్గామ్ దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులకు ప్రధాని మోదీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమాయకులైన ప్రజలను ఉగ్రవాదులు అతికిరాతకంగా చంపేశారని అన్నారు. ఈ దుర్మార్గమైన దాడులకు తెగబడ్డవారు ఎక్కడున్నా తీసుకొచ్చి మట్టిలో కలిపేసే సమయం వచ్చిందని అన్నారు. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని విధంగా వారిని శిక్షిస్తామని హెచ్చరించారు. దాడులకు పాల్పడినవారు భారీ మూల్యం చెల్లించుకుంటారని బిహార్ సభలో మోదీ వార్నింగ్

  • 21:54 PM

    Pahalgam Terror Attack Latest Updates: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్ ఐదు కీలక నిర్ణయాలు తీసుకుంది.
    ==> సింధూ జల ఒప్పందాన్ని రద్దు చేశారు
    ==> దౌత్య కార్యకలాపాల సిబ్బందిని 55 నుంచి 30కి తగ్గించారు.
    ==> పాకిస్థాన్ సైనిక దౌత్యవేత్తలను పర్సనా నాన్ గ్రాటాగా ప్రకటించారు
    ==> పాకిస్థాన్‌కు సార్క్ వీసా రద్దు చేసింది.
    ==> వాఘా అట్టారి సరిహద్దు మూసివేసింది.

  • 21:50 PM

    Pahalgam Attack Live Updates: రేపు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించనున్నారు.

  • 21:46 PM

  • 21:45 PM

    Pahalgam Terror Attack Latest Updates: భారత్, పాక్ మధ్య 1960లో సింధు జలాల ఒప్పందం జరిగింది. ఈ మేరకు సింధు, చీనాబ్, జీలం నదుల నీటిని పాక్ ఉపయోగించుకునే అవకాశముంది. వ్యవసాయం, గృహావసరాలకు ఈ నదులపైనే ఆ దేశం ఆధారపడుతోంది. భారత్ తాజాగా ఆ ఒప్పందాన్ని నిలిపేసింది. దీంతో పాక్‌లోని చాలా ప్రాంతాలు ఎడారిలా మారే ఆస్కారముంది. సింధుకు ఉప నదులైన చీనాబ్ జీలం నదులు భారత్లో పుట్టగా, చైనాలో జన్మించిన సింధు.. మన దేశం మీదుగా పాక్‌లోకి ప్రవహిస్తోంది.

  • 21:40 PM

    Pahalgam Terror Attack Latest Updates: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన  భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCS) సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని కేంద్రం స్పష్టం చేసింది. పాకిస్థాన్ పర్యాటకులు భారత్ నుంచి వెళ్లిపోవాలని తేల్చేసింది. ప్రత్యేక వీసాదారులు కూడా మరో 48 గంటల్లో భారత్‌ను వీడాలని ఆదేశాలు జారీ చేసింది.
     

  • 21:20 PM

    Pahalgam Terror Attack Latest Updates: పహల్గామ్‌లో ఉగ్రదాడిని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఖండిస్తున్నారు. ఉగ్రవాదానికి మతం లేదని.. దానిని క్షమించలేమని అన్నారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు. 

  • 20:50 PM

    Pahalgam Terror Attack Latest Updates: పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన వారికి నివాళులు అర్పిస్తూ పహల్గామ్‌లోని హోటళ్ల యజమానులు, దుకాణదారులు కొవ్వొత్తుల మార్చ్ నిర్వహించారు.
     

  • 19:31 PM

    Pahalgam Terror Attack Latest Updates: పహల్గామ్ ఉగ్రవాద దాడిపై అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ స్పందించారు. "ఈ భయంకరమైన ఉగ్రవాద దాడిలో బాధితులైన వారికి మా సంతాపం తెలియజేస్తున్నాము. అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ప్రధాని మోదీతో మాట్లాడారు. భారత ప్రభుత్వానికి, ప్రజలకు మేము చేయగలిగినంత సహాయం అందిస్తున్నాము" అని అన్నారు.

  • 19:29 PM

  • 17:54 PM

  • 17:26 PM

  • 17:25 PM

    Pahalgam Terror Attack Latest Updates: కాశ్మీర్‌లో తీవ్రవాదులు జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలుపుతూ బీసీ కమిషన్‌ కార్యాలయంలో సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కొవ్వొత్తి వెలిగించి, 2 నిమిషాల మౌనం పాటించారు. కాశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడిచేసి, సుమారు 28 మంది పర్యాటకులను అమానుషంగా హత్య చేయడాన్ని తెలంగాణ బీసీ కమిషన్‌ తీవ్రంగా ఖండించింది.  
     

  • 17:21 PM

    Pahalgam Terror Attack Latest Updates: కాల్పులకు తెగబడిన అనంతరం ఉగ్రవాదుు అడవుల్లోకి పారిపోయారు. ముష్కరుల కోసం భద్రతా బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఇప్పటికే ఎన్‌ఐఏ రంగంలోకి దిగి దర్యాప్తు వేగవంతం చేసింది. 

  • 17:05 PM
  • 17:04 PM

    Pahalgam Attack Live Updates: జమ్ము కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉగ్రదాడి మృతులకు నివాళులార్పించారు. నల్ల దుస్తులు ధరించి జాతీయ జెండాలతో నిరసన తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడిని సభ్య సమాజం తీవ్రంగా ఖండిస్తోందని.. ఈ దాడి సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉగ్రదాడికి వ్యతిరేకంగా నిరసనలకు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. పాకిస్తాన్ అసమర్థ నాయకత్వానికి ఈ ఘటన పరాకాష్ట అని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఈరోజు తెలంగాణ మొత్తం సాయంత్రం నివాళులర్పించే కార్యక్రమం చేపట్టామని తెలిపారు.
     

  • 17:03 PM

  • 17:02 PM
  • 17:01 PM

    Pahalgam Terror Attack LIVE: పహల్గామ్‌ ఉగ్రదాడిపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీనిని ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మృతులకు నివాళిగా పలు ప్రాంతాల్ల క్యాండిల్‌ లైట్లతో నిరసన తెలపుతున్నారు. ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. మరోవైపు పహల్గామ్‌ ఉగ్రదాడికి నిరసనగా జమ్మూ కశ్మీర్‌లో బంద్‌ కొనసాగుతోంది. JKHC, CCIK, ట్రావెల్‌, ట్రేడ్‌ సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి. దీనికి అధికార నేషనల్‌ కాన్ఫరెన్స్‌తో పాటు పీడీపీ, ఇతర పార్టీలు కూడా మద్ధతు ఇచ్చాయి. దాంతో షాపులన్నీ మూసివేశారు. మరోవైపు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. 
     

  • 16:59 PM

    Pahalgam Attack Live Updates: పహల్గామ్‌ ఉగ్రదాడికి దీటైన కౌంటర్‌కు కేంద్రం రెడీ అయింది. మోడీ అధ్యక్షతన CCS కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఇప్పటికే అమిత్‌ షా, రాజ్‌నాథ్ వేర్వేరు సమావేశాలు, సమీక్షలు చేపట్టారు. శ్రీనగర్‌, పహల్గామ్‌లో హోం మంత్రి అమిత్‌ షా పర్యటించారు. బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. ఉగ్రదాడి జరిగిన స్పాట్‌ను ఆయన పరిశీలించారు. మరోవైపు జమ్ముకాశ్మీర్‌పై రాజ్‌నాథ్‌ ఢిల్లీలో  CDS, త్రివిధ దళాధిపతులు, అజిత్ దోవల్‌తో రాజ్‌నాథ్‌ చర్చలు జరుపుతున్నారు. ఎలాంటి చర్యకైనా సిద్ధంగా ఉన్నామని త్రివిధ దళాధిపతులు రాజ్‌నాథ్‌కు చెప్పినట్లు తెలుస్తోంది.

  • 16:50 PM

  • 16:49 PM

    Pahalgam Attack Live Updates: పహల్గాం సమీపంలోని బైసరన్‌ లోయలో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో భద్రతా దళాలు మొత్తం జల్లెడ పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జమ్మూకశ్మీర్‌లో 56 మంది విదేశీ ఉగ్రవాదులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 18 మంది జైషే మహమ్మద్, 35 మంది లష్కరే ముఠాలకు చెందిన ఉగ్రవాదులు ఉన్నారు. మరో 17 మంది స్థానిక ఉగ్రవాదులు కూడా ఉన్నట్లు భద్రతా దళాలు వెల్లడించాయి.

  • 13:14 PM

    Pahalgam Attack Live Updates: జమ్ము కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిపై స్పందించిన మంత్రి సీతక్క

    జమ్ము కశ్మీర్ లో జరిగిన ఉగ్ర దాడిని ఖండిస్తునాను

    ఎలాంటి సిద్ధాంతం లేని ముష్కర మూక సాధారణ పౌరులను చంపడం దుర్మార్గం 

    ప్రజల ప్రాణాలను బలిగొనాలని ఏ మతము చెప్పదు

    ఉగ్రదాడికి దిగిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి

    ఉగ్రదాడిలో తమ ఆత్మీయుల ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను 

    మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను

  • 09:17 AM
  • 08:51 AM

    Pahalgam Attack Live Updates: ఉగ్రదాడితో కాశ్మీర్ లోయ ఉలిక్కిపడింది. 30 మందికిపైగా పర్యాటకులు మృతి చెందారు. దాడిని ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో ఖండించాయి. మరోవైపు సౌదీ పర్యటన నుంచి ప్రధాని మోదీ మధ్యలోనే వెనక్కి వచ్చేశారు. ఇవాళ మోదీ అధ్యక్షతన హైలెవెల్ మీటింగ్ జరగనుంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పర్యటన నేపథ్యంలో ఉగ్రవాదులు వ్యూహాత్మకంగా ఈ దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు. మరోవైపు విదేశీయులను కూడా చంపి కాశ్మీర్ అంశాన్ని చర్చకు తెచ్చేలా ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. లష్కరే తొయిబా అనుబంధ సంస్థతో పాక్ ఐఎస్ఐ ఈ రక్తపాతానికి పాల్పడినట్లు సమాచారం. 

  • 08:42 AM

    Pahalgam Attack Live Updates: చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ ఈటల రాజేందర్. 

    ==> జమ్మూలో ఉగ్రదాడిపై ఎంపీ ఈటల మాట్లాడారు. 

    ==> 370 ఆర్టికల్ రద్దు చేసి జమ్ము కాశ్మీర్ భారత్‌లో భాగమేనని మోదీ చాటి చెప్పారు

    ==> కాశ్మీర్‌లో ప్రకృతి సంపదతో పర్యాటకం తిరిగి ప్రారంభమైంది 

    ==> అలాంటి చోట ఉగ్రముకలు దాడి చేయడం అమానుష చర్య  

    ==> భారత్‌ సహనాన్ని పరీక్షిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదు

    ==> భారత ప్రజల గుండెలను ఈ ఘటన గాయపరిచింది. ఆవేశంతో రగిలిపోతున్నారు

    ==> బాధితులు చిందించిన రక్తం వృథా పోదు 

    ==> తప్పకుండా భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది.

  • 08:35 AM

  • 08:30 AM

    Pahalgam Attack Live Updates: పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి ఖండించారు. బాధితులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. నేపాల్ భారతదేశంతో దృఢంగా నిలుస్తుందన్నారు. బాధితులలో నేపాలీ జాతీయుడి నివేదికలను ధృవీకరించడానికి అధికారులతో సమన్వయం చేస్తున్నట్లు చెప్పారు. భారత్‌కు అవసరమైన అన్ని సహాయాన్ని అందిస్తామన్నారు.

  • 08:14 AM

    Pahalgam Attack Live Updates: ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. ఆర్మీ అధికారులు మొత్తం జల్లెడ పడుతున్నారు.

     

  • 07:24 AM

    Pahalgam Attack Live Updates: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఉగ్ర దుశ్చర్యను ఖండించారు. ప్రధాని మోదీకి ఫోన్ చేసి.. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదుశ్చర్యపై ఆరా తీశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

  • 23:56 PM
  • 23:48 PM

    Pahalgam Attack Live Updates: పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో అమయాక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం గుండె బద్దలయ్యే వార్త అని.. దుఃఖాన్ని వ్యక్తపరచడానికి తనకు మాటలు రావడం లేదని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.ఈ దారుణమైన చర్య వెనుక ఉన్నవారిని చట్టం ముందు నిలబెడుతామన్నారు. వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఉగ్రవాదంపై పోరాడాలనే తమ సంకల్పం అచంచలమైనదన్నారు. 

  • 23:42 PM
  • 23:39 PM

    Pahalgam Attack Live Updates: కశ్మీర్‌లో ఉగ్రవాద దాడి నేపథ్యంలో సౌదీ అరేబియా నిర్వహించిన అధికారిక విందుకు ప్రధాని మోదీ దూరంగా ఉన్నారు. తన పర్యటనను ముగించుకుని.. ఈ రాత్రి సౌదీ అరేబియా నుంచి భారత్‌కు తిరిగి రానున్నారు. రేపు రాత్రికి తిరిగి రావాల్సి ఉండగా.. ఇప్పుడు బుధవారం తెల్లవారుజామున భారత్‌కు రానున్నారు.

  • 23:36 PM

  • 23:34 PM
  • 23:33 PM

    Pahalgam Attack Live Updates: పహల్గామ్ దాడి తర్వాత దేశంలోని అనేక ప్రాంతాల్లో అధికారులు హైఅలర్ట్ జారీ చేశారు. ఉజ్జయినిలో కూడా హెచ్చరిక జారీ చేశారు. ఉజ్జయిని పోలీసులు నగరంలో కవాతు చేస్తున్నారు. అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

  • 23:23 PM

    Pahalgam Attack Live Updates: పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని నిరసిస్తూ జమ్మూలోని చాంబర్, బార్ అసోసియేషన్ బుధవారం పూర్తి బంద్‌కు పిలుపునిచ్చింది. పహల్గామ్‌లో జరిగిన క్రూరమైన దాడిలో మరణించిన అమాయక ప్రజల గౌరవార్థం ఈ బంద్‌కు మద్దతు ఇవ్వాలని తాను కాశ్మీరీలందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని PDP అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కోరారు. ఇది కేవలం కొంతమందిపై జరిగిన దాడి మాత్రమే కాదని.. ఇది మనందరిపై జరిగిన దాడి అని అన్నారు. అమాయక ప్రజల ఊచకోతను ఖండించడానికి ఈ బంద్‌కు గట్టిగా మద్దతు ఇస్తున్నామన్నారు. 

Trending News