Ceasefire Broken By Pakistan: పాకిస్థాన్ భారీ దెబ్బ.. సరిహద్దుల్లో రెచ్చిపోయి కాల్పులు

India Pakistan Ceasefire Violation LIVE Updates: ఆపరేషన్ సింధూర్ తరువాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ డ్రోన్లతో భారత్‌పై దాడికి ప్రయత్నిస్తుండగా.. సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. లైవ్‌ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  

Written by - Ashok Krindinti | Last Updated : May 10, 2025, 11:54 PM IST
Ceasefire Broken By Pakistan: పాకిస్థాన్ భారీ దెబ్బ.. సరిహద్దుల్లో రెచ్చిపోయి కాల్పులు
Live Blog

India Pakistan Ceasefire Violation LIVE Updates: భారత్ పాకిస్థాన్ మధ్య పోరు భీకరంగా సాగుతోంది. పాకిస్థాన్ వక్ర బుద్ధి మార్చుకోవడం లేదు. చీకటి కాగానే మరోసారి డ్రోన్ దాడులకు తెగబడుతోంది. జమ్మూకశ్మీర్లోని సాంబ ప్రాంతంలో డ్రోన్ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. వాయుసేన సమర్థంగా తిప్పికొట్టినట్లు తెలిపింది. ఇప్పటికే జైసల్మేర్, అంబాలా, పంచకుల ప్రాంతాల్లో బ్లాక్ అవుట్ కొనసాగుతోంది. మరోవైపు దాడులను ఉపేక్షించేది లేదని భారత్ ఇప్పటికే హెచ్చరికలు చేసింది. ఉరి ప్రాంత సరిహద్దులో నిబంధనలు ఉల్లంఘించి కాల్పులకు తెగబడుతోంది. సరిహద్దులో సామాన్య ప్రజలే లక్ష్యంగా కాల్పులు జరుపుతోంది. దీంతో ఉరి మొత్తం బ్లాక్‌ అవుట్ ప్రకటించారు. లైవ్‌ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
 

 

10 May, 2025

  • 23:54 PM
  • 23:49 PM
  • 23:47 PM

    పాకిస్థాన్‌కు ఇస్లాం పలికే అర్హత లేదు
    యుద్ధం వాతావరణం నేపథ్యంలో ఏఐఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. 'భారతదేశం కోసం ప్రాణాలు అర్పిస్తాం. ఇస్లాం పేరుతో పాకిస్థాన అసత్య ప్రచారం చేస్తోంది. అమాయకులను.. చిన్నారులను హత్య చేయాలని ఇస్లాం చెప్పలేదు. పాకిస్థాన్‌ తగిన మూల్యం చెల్లించుకుంటుంది. ఇస్లాం పేరుతో పాకిస్థాన్‌ మారణహోమం సృష్టిస్తోంది. అమ్మ కడుపులో నుంచి ఈ భూమిపై పడినప్పుడు ప్రాణం పోయే వరకు ఈ భూమి కోసమే బతకాలి' అని అసదుద్దీన్‌ ఓవైసీ తెలిపారు.

  • 23:19 PM

    డ్రోన్ల కలకలం
    శ్రీనగర్‌ రాజ్‌బాగ్‌ ప్రాంతంలో డ్రోన్లు కలకలం. 25 కార్ప్స్‌ ప్రధాన కార్యాలయం వద్ద డ్రోన్లు కనిపించాయి. అన్ని డ్రోన్లను నిర్వీర్యం చేసినట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి.

  • 23:08 PM

    సంపూర్ణ బాధ్యత పాక్‌దే
    కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం సరికాదని భారత విదేశాంగ శాఖ మంత్రి విక్రమ్‌ మిస్రీ తెలిపారు. డీజీఎంఓల మధ్య జరిగిన అవగాహనను ఉల్లంఘించడానికి ఖండిస్తున్నట్లు చెప్పారు. న్యూఢిల్లీలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు. 'కాల్పుల విరమణను కొన్ని గంటలుగా పాకిస్థాన్‌ ఉల్లంఘనలకు పాల్పడుతోంది. ఒప్పందాన్ని ఉల్లంఘించడం అత్యంత దుర్మార్గం. కాల్పుల ఉల్లంఘనకు సంపూర్ణ బాధ్యత పాక్‌దే' అని ప్రకటించారు.

  • 23:04 PM
  • 22:59 PM

    India Pakistan Ceasefire Violation LIVE Updates: శ్రీనగర్‌లో ఎలాంటి కాల్పులు గానీ.. పేలుళ్లు లేవని సైనిక వర్గాలు వెల్లడించాయి. శ్రీనగర్‌లోకి కొన్ని డ్రోన్లు వచ్చాయని.. మళ్లీ వెనక్కి వెళ్లాయని తెలిపాయి. 

  • 22:29 PM

    India Pakistan Ceasefire Violation LIVE Updates: కేంద్ర హోం కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు.

    ==> ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

  • 22:17 PM

    India Pakistan Ceasefire Violation LIVE Updates: కాల్పుల విరమణ కోసం వేడుకుని గంటలు గడవక ముందే పాక్ దొంగ బుద్ధి చూపడంపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఫైర్ అయ్యారు. కుక్క తోక ఎప్పటికీ వంకరగానే ఉంటుందని ట్వీట్ చేశారు. 

     

  • 22:01 PM

  • 21:47 PM
  • 21:45 PM

    India Pakistan Ceasefire Violation LIVE Updates: అనేక చోట్ల పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనలు

    - నగ్రోటాలోని సుందర్‌బానీ సెక్టార్‌లో కాల్పుల విరమణ ఉల్లంఘన.

    - గుజరాత్‌లోని భుజ్‌లో బ్లాక్‌అవుట్.

    - జమ్మూలో 10 డ్రోన్‌లు కనిపించాయి.

  • 21:44 PM

    India Pakistan Ceasefire Violation LIVE Updates: పెషావర్‌లో భారీ పేలుళ్లు.. 

    ==> మరోసారి లక్ష్యంగా మారిన PAF బేస్

    ==> పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ (PAF) బేస్‌పై మళ్లీ దాడులు
        
    ==> పెషావర్‌ PAF బేస్‌లో భారీ పేలుళ్లు 

  • 21:40 PM

    India Pakistan Ceasefire Violation LIVE Updates: కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్  ఉల్లంఘన 

    ==> జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర సరిహద్దుల్లో కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు సమాచారం

    ==> శ్రీనగర్ ప్రాంతాల్లో మరోసారి కాల్పులకు తెగబడ్డ పాక్

    ==> కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయని సీఎం ఓమర్ అబ్దుల్  ట్వీట్

  • 21:34 PM

    Pakistan Violates Ceasefire LIVE Updates: భారత్-పాక్ కాల్పుల విరమణ 3 గంటలు కూడా కొనసాగలేదు. పాకిస్థాన్‌ వైపు నుంచి డ్రోన్లు ఈ ప్రాంతాల వైపు దూసుకువస్తున్నాయి. 

    ==> ఉధంపూర్
    ==> అఖ్నూర్
    ==> నౌషేరా
    ==> పూంచ్
    ==> రాజౌరి
    ==> మెంధార్
    ==> జమ్మూ
    ==> సుందర్‌బాని
    ==> RS పుర
    ==> ఆర్నియా
    ==> కతువా

  • 21:19 PM
  • 21:17 PM

    Pakistan Violates Ceasefire LIVE Updates: ఓ వైపు కాల్పుల విరమణ అంటూనే పాక్ ఆర్మీ బార్డర్‌లో మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. శ్రీనగర్, జమ్మూ, ఉదంపూర్, RS పురా, అఖ్నూర్, చాంబ్, బింబర్ ప్రాంతాల్లో మోర్టార్ షెల్స్‌తో దాడులు చేస్తోంది. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని భారత ప్రభుత్వం BSFకు పూర్తి అధికారాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు శ్రీనగర్లో బ్లాక్‌ అవుట్ విధించారు. సీజ్ ఫైర్ ఒప్పందం ఏమైందని జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు.

  • 20:22 PM
  • 19:11 PM

  • 19:08 PM
  • 18:22 PM
  • 18:20 PM

  • 18:09 PM

    Donald Trump Tweet: తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించిన భారత్ పాక్ 

    ==> భారత డీజీఎంవో కి పాకిస్తాన్ డీజీఎంవో ఫోన్ 

    ==> సాయంత్రం 5 గంటల నుంచి సిజ్ ఫైర్ 

    ==> ధ్రువీకరించిన విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి

  • 17:46 PM
  • 17:45 PM
  • 17:41 PM

    Operation Sindoor LIVE Updates: భారత్-పాక్ యుద్ధం నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

     

  • 17:35 PM

    Operation Sindoor LIVE Updates: వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పేరు వైరల్ అవుతున్న ఈ ట్వీట్ ఫేక్.

     

  • 17:12 PM

    Operation Sindoor LIVE Updates: జూబ్లీహిల్స్‌లోని రిపబ్లిక్ టర్కీ కాన్సులేట్ జనరల్ వద్ద పోలీసుల భారీ భద్రత 

    ==> రిపబ్లిక్ టర్కీ కాన్సులేట్ జనరల్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్న పోలీసులు
    ==> టర్కీ కాన్సులేట్ జనరల్ వద్ద కొనసాగుతున్న పోలీసుల ఆంక్షలు 
    ==> భారత్ సరిహద్దులో పాకిస్థాన్‌కి చెందిన 400 డ్రోన్లను పేల్చిన  భారత్
    ==> పాకిస్థాన్‌కు డ్రోన్లు అందజేసిన టర్కీ 
    ==> గగనతలంలోనే టర్కిష్ డ్రోన్లను ధ్వంసం చేసిన భారత్
    ==> దీంతో టర్కీ కాన్సులేట్ జనరల్ వద్ద ఆందోళనలు జరిగే అవకాశం ఉన్నందున పోలీసుల బందోబస్తు 

     

  • 17:09 PM

  • 16:36 PM

    Operation Sindoor LIVE Updates: బృహన్ ముంబై పరిధిలోని ఏ ప్రదేశంలోనూ ఎవరూ ఎటువంటి బాణసంచా పేల్చకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో రెండు నెలలు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని పేర్కొంది.  

  • 15:47 PM
  • 15:42 PM

    Operation Sindoor LIVE Updates: పెళ్లయిన మూడు రోజులకే బోర్డర్‌కు తిరిగి రావాలని జవాన్‌కు పిలుపు

    ==> మహారాష్ట్రకు చెందిన జవాన్‌ మనోజ్ పాటిల్‌కు ఈనెల 5న వివాహం జరిగింది

    ==> వివాహ సెలవుల మీద ఉన్న జవాన్‌ మనోజ్ పాటిల్‌కు భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా బోర్డర్‌కు తిరిగి రావాలని పిలుపొచ్చింది

    ==> మనోజ్ భార్య యామిని ‘నా సింధూరాన్ని దేశ రక్షణ కోసం బోర్డర్‌కు పంపుతున్నా' అంటూ కన్నీటితో పంపించింది.

    ==> పెళ్ళైన మూడు రోజులకే తిరిగి బోర్డర్‌కు వెళ్లడంతో మనోజ్ పాటిల్ భార్య, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

  • 15:31 PM

    Operation Sindoor India Pakistan War LIVE: సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో.. సా.5 గంటలకు గవర్నర్‌తో సీఎం చంద్రబాబు భేటీ

    ==> కేంద్రానికి ఏపీ సంఘీభావంపై చర్చ
    ==> తిరుపతి, విశాఖ లాంటి సున్నిత ప్రాంతాల్లో..
    ==> రక్షణ చర్యలపై గవర్నర్‌కు వివరించనున్న చంద్రబాబు

  • 15:23 PM

  • 14:55 PM

    మొబైల్‌ ఫోన్లకు యుద్ధ హెచ్చరికలు
    భారత్‌, పాకిస్థాన్‌ యుద్ధ వాతావరణంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఇకపై ఈ హెచ్చరికలు నేరుగా మొబైల్‌ ఫోన్లకు రానున్నాయి. ప్రజలను హెచ్చరిస్తూ ఫోన్లకు ప్రభుత్వాలు అలర్ట్‌లు జారీ చేయనున్నాయి. ఈ హెచ్చరికలు ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా అందించనున్నాయి.

  • 14:35 PM

    కార్మిక సంఘాల సమ్మెపై యుద్ధం ప్రభావం
    భారతదేశం - పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో కార్మిక సంఘాలు ఈనెల 20వ తేదీన చేపట్టిన దేశవ్యాప్త సమ్మెపై ప్రభావం పడింది. యుద్ధం నేపథ్యంలో సమ్మె విరమించుకోవాలని భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) జాతీయ ప్రధాన కార్యదర్శి రవీంద్ర హింతే విజ్ఞప్తి చేశారు. బీఎంఎస్ సమ్మెలో లేదు.. రక్షణశాఖ సంబంధిత విభాగాల పరిశ్రమలలో ఓటీ చేస్తామని ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకింగ్, రవాణా రంగాలలో ఉద్యోగులు దేశం కోసం పని చేయాలని పిలుపునిచ్చారు.

  • 14:29 PM

    Operation Sindoor LIVE Updates: మే 7న భారత సైన్యం జరిపిన దాడిలో హతమైన ఉగ్రవాదుల వివరాలు ఇలా.. 

    1.ముదస్సర్ ఖడియాన్ ఖాస్ @ ముదస్సర్ @ అబు జుండాల్

    ==> సంస్థ: లష్కర్-ఎ-తొయిబా

    ==> మురీడ్‌కేలోని మార్కజ్ తోయిబా ఇన్‌ఛార్జ్.

    ==> పాక్ ఆర్మీ అతని అంత్యక్రియలకు గౌరవ వందనం ఇచ్చింది.

    ==> పాక్ ఆర్మీ చీఫ్, పంజాబ్ ముఖ్యమంత్రి (మర్యం నవాజ్) తరఫున పుష్పగుచ్ఛాలు సమర్పించారు.

    ==> ప్రభుత్వ పాఠశాలలో అతని జనాజా నమాజ్ జరిగింది. దానికి జమాత్-ఉద్-దావా నేత హఫీజ్ అబ్దుల్ రవూఫ్‌ (గ్లోబల్ టెర్రరిస్ట్‌గా గుర్తింపు పొందినవాడు) నేతృత్వం వహించాడు.

    ==> ఒక సర్వీసింగ్ లెఫ్టినెంట్ జనరల్, పంజాబ్ పోలీస్ ఐజి అతని ప్రార్థనా సభకు హాజరయ్యారు.

    2.హఫీజ్ ముహమ్మద్ జమీల్

    ==> సంస్థ: జైష్-ఇ-ముహమ్మద్
    ==> మౌలానా మసూద్ అజ్హర్‌కు దగ్గర బంధువు (తమ్ముడి భార్యలలో ఒకరి అన్న).
    ==> బహావల్‌పూర్‌లోని మార్కజ్ సుభాన్ అల్లాహ్‌కు ఇన్‌ఛార్జ్.
    ==> యువతను తీవ్రవాద సిద్ధాంతాలతో భ్రష్టపరచడం.. జేఎం నిధుల సేకరణలో కీలక పాత్ర వహించేవాడు.

    3.ముహమ్మద్ యూసుఫ్ అజ్హర్ @ ఉస్తాద్ జీ @ ముహమ్మద్ సలీం @ ఘోషి సాహబ్
    ==> సంస్థ: జైష్-ఇ-ముహమ్మద్
    ==> మసూద్ అజ్హర్‌కు బావ.
    ==> జేఎం కోసం ఆయుధ శిక్షణ అందించేవాడు.
    ==> జమ్మూ కాశ్మీర్‌లో అనేక ఉగ్రవాద దాడుల్లో పాల్గొన్నాడు.
    ==> IC-814 విమానం హైజాక్ కేసులో నిందితుడిగా ఉన్నాడు.

    4. ఖాలిద్ @ అబు ఆకాషా

    ==> సంస్థ: లష్కర్-ఎ-తొయిబా
    ==> జమ్మూ కాశ్మీర్‌లో అనేక ఉగ్రదాడుల్లో పాలుపంచుకున్నాడు.
    ==> ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆయుధాల అక్రమ రవాణాలో పాల్గొన్నాడు.
    ==> ఫైసలాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు, ఫైసలాబాద్ డిప్యూటీ కమిషనర్ హాజరయ్యారు.

    5.ముహమ్మద్ హసన్ ఖాన్
    ==> సంస్థ: జైష్-ఇ-ముహమ్మద్
    ==> ముఫ్తీ అస్గర్ ఖాన్ కాశ్మీరీ కుమారుడు (పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో జెఎం ఆపరేషనల్ కమాండర్).
    ==> జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడులను సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

  • 14:13 PM

  • 13:58 PM

    Operation Sindoor LIVE Updates: కాకినాడ జిల్లాలో మూడు పోర్టులు పనిచేస్తున్నాయి. పెద్దాపురం సబ్ డివిజన్ పరిధిలోని తొండంగి మండలంలో నూతనంగా నిర్మితమవుతున్న గేట్ వే పోర్ట్‌తో పాటు తీరప్రాంతాలలో ఉగ్రవాదుల చొరబాటు లేకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాలతో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు బృందం పర్యవేక్షణ చేస్తోంది. డ్రోన్స్‌తో 24 గంటల నిఘా పెట్టారు. అదేవిధంగా మత్స్యకారులతో కలిసి పనిచేస్తూ అనుమానితుల సమాచారం తీసుకుంటున్నారు. కార్డన్ అండ సెర్చ్ నిర్వహించడం వంటి చర్యలతో అప్రమత్తంగా ఉన్నారు.

  • 13:46 PM

    India Pakistan War LIVE: భారత్, పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. బహిరంగ ప్రదేశాలలో.. ముఖ్యంగా మిలిటరీ కంటోన్మెంట్ ప్రాంతం, చుట్టుపక్కల బాణసంచా కాల్చడాన్ని నిషేధించారు.
     

  • 13:37 PM

    Operation Sindoor LIVE Updates: పాకిస్థాన్ దృశ్చర్యలను ప్రతిఒక్క భారతీయుడు తిప్పికొట్టాలని ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఉర్దూ జర్నలిస్ట్ అవార్డుల ప్రదానోత్సవం ఆయన మాట్లాడుతూ.. ఇస్లాం పేరుతో పాకిస్థాన్ మారణహోమం సృష్టిస్తుందని విమర్శించారు. భారతదేశం నుంచి విడిపోయిన తరువాత పాకిస్థాన్.. ఇక్కడి హిందువులకు, ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని చూసిందన్నారు. పెహాల్గామ్‌లో కుటుంబ సభ్యుల ముందు అతి కిరతకంగా హతమార్చారని.. అందుకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్‌తో భారత సైనికులు సరైన సమాధానం ఇస్తున్నారని అన్నారు. పాకిస్థాన్ ఆర్మీ సివిలియన్స్ టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతుందని.. దానికి తగిన మూల్యం చెల్లిచుకుంటుందని స్పష్టం చేశారు. భారతదేశ ముస్లింలు దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారని.. సైనికులకు అండగా ఉంటామన్నారు.

  • 13:27 PM

    Operation Sindoor LIVE Updates: ఇండియన్ ఆర్మీకి సపోర్టుగా సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ రెండవ బొగ్గు గని ఆవరణలో కార్మిక నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని గని ఆవరణలో ర్యాలీ నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిందంటూ పాక్‌పై ఉక్కు పాదం మోపాలని నినాదాలు చేశారు. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ ఇండియన్ ఆర్మీకి మద్దతుగా నిలిచారు. జవాన్ మురళి నాయక్ మృతి పట్ల నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ పాకిస్తాన్ దేశం ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందన్నారు. యుద్ధం పేరిట భారత్ లోని గ్రామాలు, అమాయకులపై దుశ్చర్యకు పాల్పడుతుందన్నారు. పాకిస్థాన్‌కు ఇండియన్ ఆర్మీ బుద్ధి చెబుతుందని అన్నారు.
     

  • 13:21 PM

    Operation Sindoor LIVE Updates: ఉగ్రవాదాన్ని అంతం చేసే లక్ష్యంతో పోరాటం చేస్తున్న భారత సైన్యానికి మరింత ఆత్మస్థైర్యాన్ని అందించాలని ప్రార్థిస్తూ.. బషీర్‌బాగ్ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 

    ==> ఇన్నేళ్లుగా పాకిస్థాన్ తమపై దాడులు చేస్తుంటే చూస్తూ కూర్చున్నాము

    ==> కానీ ఇప్పుడు దాడికి ప్రతి దాడితో సమాధానం ఇస్తున్నాము

    ==> పెహల్గామ్ దాడికి ప్రతిదాడిగా ఆపరేషన్ సింధూర్‌తో టెర్రరిస్టుల స్థావరాలను భారత సైన్యం నిర్వీర్యం చేసింది

    ==> ఈ పోరాటంలో భారత సైనికులకు ఆత్మస్థైర్యం ఇచ్చేలా అన్ని వర్గాల ప్రజలు దేవుళ్ళకు ప్రత్యేక పూజలు నిర్వహించాలి

    ==> భారత సైన్యం ఈ పోరాటంలో విజయం సాధిస్తుందని తాను దృఢంగా విశ్వసిస్తున్నాను.

  • 12:56 PM

    Operation Sindoor LIVE Updates: శ్రీనగర్‌లో పాత ఎయిర్‌ఫీల్డ్ (టెక్నికల్ ఎయిర్‌పోర్ట్) వద్ద ఒక డ్రోన్‌ను కూల్చివేసిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్.

    ==> ఈ ఘటన సమయంలో నగరాన్ని భారీ పేలుళ్లు వణికించాయి.

    ==> మధ్యాహ్నం సమయంలో శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో రెండు భారీ పేలుళ్లు వినిపించాయని అధికారులు తెలిపారు.

  • 12:42 PM

    Operation Sindoor LIVE Updates: జమ్ములోని చీనాబ్ రీజన్‌లోని స్థానిక ప్రజలకు భధ్రత బలగాల హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. బయటకు రావొద్దంటూ సైరన్ మోగించి మైకులో అనౌన్స్ చేస్తున్న ఆర్మీ.

  • 12:29 PM

  • 11:55 AM

    Operation Sindoor LIVE Updates: పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు దిగుతోంది: కర్నల్ సోఫియా ఖురేషి 

    - దాడులతో ఉద్రిక్తత పెంచుతోంది. వాటిని భారత సైన్యం గట్టిగా తిప్పికొడుతోంది. 

    -శ్రీనగర్, ఉదంపూర్ , బటిండాలో దాడులకు పాల్పడుతోంది

    - పలు చోట్ల పాఠశాలలు, వాయుసేన ఆసుపత్రులపై కూడా దాడులకు పాల్పడుతోంది. 

    -భుజ్, బటిండాలోని ఎయిర్ స్టేషన్లపై పాకిస్తాన్ దాడి చేసింది. 

Trending News