)
UIDAI New Rules: దేశ పౌరుడిగా భారతదేశంలో గుర్తింపు.. ధ్రువీకరణ పత్రం ఆధార్ కార్డు. ప్రస్తుతం ప్రతి దరఖాస్తులు, ప్రతి పథకానికి ఆధార్ కార్డు తప్పనిసరి అయ్యింది. దేశంలో ఎక్కడికైనా ఆధార్ కార్డు ఉండాల్సిందే. అలాంటి ఆధార్ కార్డులో కీలక మార్పులు జరుగుతున్నాయి. ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవడానికి మరింత సులభతరం కానుంది. నవంబర్ 1వ తేదీ నుంచి కీలక మార్పులు వస్తున్నాయి.
ఇకపై భౌతికంగా కాకుండా ఆన్లైన్ను ఉపయోగించి ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఆధార్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం ఆధార్ కేంద్రాల చుట్టూ ఇకపై తిరగాల్సిన పనిలేదు. ఆధార్ కార్డులో 2025 సంవత్సరంలో భారీ మార్పులు జరిగాయి. యూఐడీఏఐ ఈ సంవత్సరం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో కోట్లాది మంది ఆధార్ కార్డుదారులకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కీలక ప్రకటన చేసింది. నవంబర్ 1 నుంచి ఆధార్ కార్డు వివరాల అప్డేట్లో అతిపెద్ద మార్పు తీసుకురానున్నట్లు తెలిపింది.
ఆధార్ కార్డులో పేరు, అడ్రస్, పుట్టిన తేదీ, లింగం, మొబైల్ నంబర్ వంటి ముఖ్యమైన వివరాలను అప్డేట్ కోసం కార్యాలయాలకు వెళ్తుంటారు. ఇకపై ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లకుండానే పూర్తిగా ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ అప్డేట్ ప్రక్రియను మరింత వేగంగా, సురక్షితంగా మార్చడమే లక్ష్యంగా కొత్త ఆన్లైన్ విధానం తీసుకువచ్చింది. అయితే కొత్త విధానంలో ఛార్జీల భారం మోగనుంది.
అప్డేట్ ఫీజులు పెంపు
అక్టోబర్ 1వ తేదీ నుంచి అప్డేట్ ఫీజు పెరిగిన విషయం తెలిసిందే. పేరు, అడ్రస్ మార్చుకోవడానికి ఇప్పుడు రూ.75 చెల్లించాలి. బయోమెట్రిక్ మార్పులకు రూ.125 చెల్లించాల్సి ఉంది.
పిల్లలకు ఉచితం
ఏడేళ్ల నుంచి 15 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లల ఫింగర్ ప్రింట్స్, బయోమెట్రిక్ మార్చడానికి అయ్యే ఖర్చును ఆధార్ సంస్థ ఉచితం చేసింది.
ఒక ఆధార్.. ఒక వ్యక్తి
ఒక వ్యక్తికి ఒక ఆధార్ కార్డు ఉండాలి. ఒక వ్యక్తికి అనేక ఆధార్ కార్డులు ఉంటే నేరపూరితం. ఒక వ్యక్తికి అనేక ఆధార్ కార్డులు వాడితే కఠిన చర్యలు తప్పవని యూఐడీఏఐ హెచ్చరించింది.
ఉచిత గడువు ముగింపు
ఆధార్ కార్డు అప్డేట్ ఉచిత అవకాశం ముగిసింది. జూన్ 14వ తేదీ వరకు ఆన్లైన్లో డాక్యుమెంట్లు ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం ఇకపై లేదు. ఇప్పుడు అన్ని అప్డేట్లకు ఫీజు వర్తించనుంది.
నవంబర్ 1 నుంచి డిజిటల్ అప్డేట్
ఆధార్ సంస్థ నవంబర్ 1 నుంచి అమల్లోకి తీసుకువస్తున్న అతిపెద్ద మార్పు డిజిటల్ అప్డేట్. జనాభా వివరాల అప్డేట్ పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరగనుంది. ఆధార్ కేంద్రాల ముందు వరుసగా పడిగాపులు కాయకుండా మొత్తం ఆన్లైన్ చేశారు. పేరు, అడ్రస్ వంటి జనాభా వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేసుకునే అవకాశం దక్కనుంది. అయితే ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ వంటి బయోమెట్రిక్ అప్డేట్స్ కోసం మాత్రం ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించక తప్పదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి