
Man dies by snake in Bengaluru: వానాకాలంలో పాముల సంచారం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పాములు అడవులు, గుబురుగా ఉన్న చెట్ల నుంచి మానవ ఆవాసాల్లోకి ఎక్కువగా వస్తాయి. మన ఇళ్లలోకి బూట్లు, వెహికిల్ డిక్కీల్లోకి పాములు దూరి నక్కి ఉంటాయి. కొన్నిసార్లు బట్టలలో, బెడ్ లలో పాములు దూరిపోతాయి. ఇలాంటి ఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి.
అంతేకాకుండా పాముల కాటు ఘటనలు సైతం వర్షాకాలంలో ఎక్కువగా వెలుగులోకి వస్తాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బెంగళూరులో ఒక టెకీ పాము కాటుకు గురయ్యాడు. అయితే.. అతనికి ఈ విషయం తెలీయ లేదు. కాటు వేసిన కొన్ని గంటల వ్యవధిలోనే నురగలు కక్కుకుని దుర్మరణం చెందాడు.
బెంగళూరులో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అనేకల్ తాలూక్ బన్నేర్ఘట్టలో నివాసం ఉండే.. మంజు ప్రకాశ్ టీసీఎస్ లో జాబ్ చేస్తున్నాడు. అతను 2016లో జరిగిన ఓ బస్సు ప్రమాదం కారణంగా తన పాదాల స్పర్శను కోల్పోయాడు. అప్పటి నుంచి అతని కాళ్లకు ఎలాంటి స్పర్షలేదు. అయితే.. ఇటీవల అతను ఇంటి నుంచి బైటకు వెళ్లేటప్పుడు చెప్పులు ధరించాడు.
అయితే.. ఆ చెప్పులో ఒక విషపూరిమైన పాము పిల్ల నక్కి కూర్చుంది. దాన్ని అతను గమనించలేదు. అది అతడ్ని పలుమార్లు కాటు వేసింది. స్పర్ష లేకపోవడం వల్ల గంటల వ్యవధిలో చాలా వీక్ నెస్ కు గురయ్యాడు. వెంటనే ఇంటికి తిరిగి వచ్చేసి బెడ్ మీద పడిపోయాడు. కాసేపటికి నురగలు కక్కుతు చనిపోయాడు. మరోవైపు స్లిప్పర్ లో ఉన్న పాము పిల్ల సైతం.. ఊపిరాడక చనిపోయింది. కాసేపటికి ఇంటికి అతని సోదరుడు వచ్చి చూడగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
వెంటనే డాక్టర్ ను పిలిపించగా అతడ్ని చూసి పాము కాటుతోనే అప్పటికే చనిపోయాడని చెప్పారు. బైట ఉన్న స్లిప్పర్ లో పాము ఉందని వాచ్ మెన్ చెప్పడంతో వెళ్లిచూశారు. ఆ తర్వాత వీరికి అసలు విషయం తెలిసింది. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.ఆ కుటుంబం ఈ ఘటనతో కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.