)
Married woman killed her husband for lover in uttar Pradesh: ఇటీవల కాలంలో భార్యభర్తలు ఒకర్ని మరోకరు మర్డర్ లు చేసుకుంటున్నారు. అసలు పెళ్లి చేసుకుని ఒకరితో మరోకరు ఎలా అన్యోన్యంగా ఉండాలో చూడకుండా.. ఏవిధంగా మర్డర్లు చేయాలోస్కెచ్ లు వేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు రోజు ఎక్కడోఒక చోట జరుగుతున్నాయి. దీంతో పవిత్రమైన వివాహబంధం కాస్త..వీళ్లవల్ల అభాసుపాలు అవుతుంది.
ఈ నేపథ్యంలో యూపీలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఉత్తర ప్రదేశ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. సుల్తాన్ పూర్ కిండిపూర్ లో మహేష్ తన భార్య పూజ తో కలిసి ఉంటున్నారు. వీరికి, ఇద్దరు పిల్లలు. అయితే. పూజకు ఏడాది క్రితం.. అదే గ్రామానికి చెందిన వివాహితుడు, జయ ప్రకాష్ తో.. పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధంగా మారింది. ఇద్దరు భర్త కళ్లుకప్పి తరచుగా సీక్రెట్ యవ్వారం సాగించేవారు.
ఇక భర్తనులేపేస్తే ఎంజాయ్ చేయోచ్చని ప్లాన్ వేశారు. దీనిలో భాగంగా ఇటీవల భార్య పూజ... భర్తను బైటకు తీసుకెళ్లి ఫుల్గా తాగించింది. ఆతర్వాత మద్యం మత్తులో తిరిగి ఇంటికి వస్తున్నారు.మెల్లగా ప్రియుడికి కాల్ చేసింది. ఇద్దరుకూడా పక్కా ప్లాన్ తో భర్త ను ఈమె పదునైన రాతితో కొట్టిగా.. ఆమె ప్రియుడు కత్తితో పలు మార్లు పొడిచాడు.
దీంతో అతను చనిపోయాడు. ఏం తెలియనట్లు శవాన్ని పడేసి.. ఇంటికిచేరుకుంది. తన భర్త కన్పించడంలేదని దొంగడ్రామాలు ఆడింది. ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసుకున్నారు.
ఈ మహిళనుచూసి పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్ లో విచారించారు. దీంతో సదరు మహిళ అసలు విషయం అంతా బైటపెట్టింది. దీంతో మహిళను, ఆమె ప్రియుడ్ని అరెస్ట్ చేశారు. తన భర్త అందంగా లేడని, ప్రియుడు అక్షయ్ కుమార్ లా ఉండటం వల్ల మర్డర్ చేసినట్లు చెప్పుకొచ్చింది. దీంతో పోలీసులు ఇద్దర్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.