Sabarimala- Mandala Makaravilakku Pooja: గాడ్స్ ఓన్ కంట్రీ అయిన కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం మండల పూజకు ముస్తాబయింది. ప్రధాన అర్చకుడి సమక్షంలో ఆదివారం నాడు ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. సాంప్రదాయ బద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గర్భగుడి నుంచి తీసుకువచ్చిన జ్వాలతో పదు నెట్టాంబడి వద్ద జ్యోతిని వెలిగించారు. ఆదివారమే ఆలయం తెరుచుకన్నప్పటికీ వృశ్చిక మాసాన్ని పురస్కరించుకుని ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు అధికారికంగా భక్తులకు అనుమతిచ్చారు.
కొత్త పూజారులు తలుపులు తెరవడంతో తీర్థయాత్ర సీజన్ మొదలయింది. ఇక నేటి నుంచి భక్తులను అయ్యప్ప దర్శనం కోసం అనుమతిస్తున్నారు. 41 రోజుల పాటు జరిగే మండల పూజ డిసెంబర్ 27న ముగుస్తుంది. అదే రోజు రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసివేయనున్నారు.
మళ్లీ డిసెంబర్ 30న మకరవిలక్కు కోసం ఆలయాన్ని తెరుస్తారు. 2026 జనవరి 14న మకర జ్యోతి దర్శనం ఉంటుంది. అదే నెల 20న ఆలయాన్ని మూసివేస్తారు. ఈ 41 రోజులు ఆలయం తెరిచి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అయ్యప్ప దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఈ నేపథ్యంలో శబరిమలకు వెళ్లే రైల్లు కిక్కిరిసి పోతున్నాయి.
Also Read: ధర్మేంద్ర మొదటి భార్య ఎవరు..? విడాకులు ఇవ్వకుండానే ఎందుకు రెండో వివాహాం చేసుకున్నాడు..
Also Read: చిరంజీవికి అమ్మగా.. అక్కగా.. చెల్లిగా..భార్యగా యాక్ట్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.









